సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా సీపీఎం నాయకుడు టి.షడ్రక్, గిరిజన ఉద్యమ నాయకుడు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సీఐటీయూ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌస్ దేశాయ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో సంతాపసభ నిర్వహించారు. షడ్రక్ కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధిగా స్థానికుల సమస్యల పరిష్కారం కోసం విశేషంగా కృషిచేశారని అన్నారు. సీపీఎంలో సర్పంచ్ నుంచి […]
సారథి న్యూస్, కర్నూలు: సీపీఎం సీనియర్ నేత, పార్టీ కర్నూలు జిల్లా కమిటీ సభ్యుడు టి.షడ్రక్(62)మంగళవారం కరోనాతో తనువు చాలించారు. కొద్దిరోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ప్రాణం విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ఖాన్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటని జిల్లా […]
బస్సులోనే అసెంబ్లీకి వెళ్లిన సున్నం రాజయ్య ఆటోలో సెక్రటేరియట్కు వచ్చిన ప్రజానేత సారథి న్యూస్, హైదరాబాద్: ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు తరాలకు తరగదని ఆస్తులు సంపాదించుకుంటున్న రోజులివి.. కానీ ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత కారు కూడా లేని ప్రజానేత.. బస్సులోనే అసెంబ్లీకి వెళ్లిన ఘనచరిత.. ఆయనే మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య. కరోనా బారినపడి కన్నుమూయడాన్ని ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలు తట్టుకోలేకపోతున్నారు. సహజంగా ప్రజాప్రతినిధి అనగానే కార్లు, సెక్యూరిటీ సిబ్బంది ఇలా […]
సారథి న్యూస్, భద్రాచలం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (60) సోమవారం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. ఆయన భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014 ఎన్నికల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వారు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రాజయ్య మృతికి తెలంగాణ సీఎం […]
సారథి న్యూస్, కోదాడ : రాష్ర్టంలో కరోనా విస్తరణ రోజురోజుకు పెరిగిపోతుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కుక్కడపు ప్రసాద్ అన్నారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, వైరస్ బారిన పడిన పేదవారు ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స చేయించుకోలేక పోతున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ బుధవారం కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆ పార్టీ నాయకులతో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెల్ది పద్మావతి, ఎం.ముత్యాలు, నాగరాజు, జె.సాయి […]
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా టీచర్ను ఐక్యరాజ్య సమితి వక్తగా ఆహ్వానించింది. కోవిడ్–19ను సమర్థవంతంగా ప్రతిఘటించినందుకు యూఎన్వో(యునైటెడ్ నేషన్స్ఆర్గనైజెషన్) నిర్వహించే ప్రజాసేవా దినోత్సవంలో ఆమె ప్రసంగించనున్నారు. కరోనాపై యుద్ధంలో సీపీఎం నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆ చర్యలను ప్రపంచదేశాలకు మంత్రి వివరించనున్నారు.
సారథిన్యూస్, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు డేరంగుల నర్సింహపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని ఆపార్టీ నేతలు పేర్కొన్నారు. పొల్కంపల్లి గ్రామంలోని ఓ భూవివాదం గురించి మాట్లాడటానికి వెళ్లిన టీఆర్ఎస్ నేత నర్సింహపై.. సీపీఎం కార్యకర్తలు విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ దాడిలో నర్సింహ గాయపడగా అతడిని ఇబ్రహీంపట్నంలోని ఓ దవాఖానకు తరలించి చికిత్సనందిస్తున్నారు. టీఆర్ఎస్ నేతపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీటీసీలు రవీందర్, శ్రీశైలం, కో ఆప్షన్ సభ్యులు ఎండీ షరీఫ్, […]