Breaking News

ఎమ్మార్పీఎస్

జలాల్​.. నువ్వెంత? నీ స్థాయి ఎంత?

జలాల్​.. నువ్వెంత? నీ స్థాయి ఎంత?

మనువాదుల పార్టీ నుంచి బయటికొచ్చి మాట్లాడు నాగర్ కర్నూల్ గడ్డ.. మహేంద్రనాథ్ అడ్డా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గూట విజయ్ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మరాజుపై బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జలాల్ శివుడు చేసిన ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పకపోతే భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గూట విజయ్ హెచ్చరించారు. ధర్మం తప్పితే మీలాంటి వారికి యమధర్మరాజే అవుతారని హితవు […]

Read More
మంద కృష్ణ మాదిగను పరామర్శించిన ఆర్ఎస్పీ

మంద కృష్ణ మాదిగను పరామర్శించిన ఆర్ఎస్పీ

సామాజిక సారథి, హైదరాబాద్​: ప్రమాదవశాత్తు కాలికి గాయమై సర్జరీ చేయించుకున్న ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణమాదిగను బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్​ డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం పరామర్శించారు. విద్యానగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. ఆయన వెంట బీఎస్పీ నేతలు చౌటి ప్రభాకర్​, అనిల్​ తదితరులు ఉన్నారు.

Read More
‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే ‘దళితబంధు’’

‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే ‘దళితబంధు’’

సారథి, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, వీహెచ్​పీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దళిత ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని, పేదలకు డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు కట్టిస్తామని చేసిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా మరోసారి […]

Read More
రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలుచేయాలి

రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాలి

సారథి, వేములవాడ: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ వేములవాడ పట్టణంలోని సినారె కళామందిరం, తెలంగాణ చౌక్ వద్ద షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. హుజూరాబాద్ లో రాష్ట్రప్రభుత్వం దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసి ప్రతి దళిత కుటుంబానికి ఈనెల 30వ తేదీలోపు రూ.1​0లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి […]

Read More
ఘనంగా ఎమ్మార్పీఎస్​ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా ఎమ్మార్పీఎస్​ ఆవిర్భావ దినోత్సవం

సారథి, వాజేడు: ఎమ్మార్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవాన్ని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికెల వేణు మాదిగ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం అనునిత్యం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూనే ఉన్నారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, వికలాంగుల పింఛన్ ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. దళితులను ఏడేళ్లుగా మోసం చేసిన […]

Read More
దళితుల భూములు గుంజుకుంటే దండయాత్ర చేస్తం

దళితుల భూములు గుంజుకుంటే దండయాత్ర చేస్తం

సారథి న్యూస్, మహబూబ్ నగర్: తాత, ముత్తాతల నుంచి దళితుల చేతుల్లో ఉన్న సాగు భూములను గుంజుకుంటే సర్కారుపై దండయాత్ర తప్పదని మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. శనివారం రాత్రి ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్ లో రిలే దీక్షలు చేపట్టిన బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళితుడిని […]

Read More
పూలే విగ్రహ ధ్వంసం సరికాదు

పూలే విగ్రహధ్వంసం హేయం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: వరంగల్ లో జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మురళి మాదిగ డిమాండ్ చేశారు. మురికివాడల్లో నివసించే పేద వారి కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి, ఉచితంగా విద్యను అందించిన ఆదర్శప్రాయుడు జ్యోతిరావు పూలే అన్నారు. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

Read More
హక్కుల సాధనకు ఎమ్మార్పీఎస్ పోరాటం

హక్కుల సాధనకు ఎమ్మార్పీఎస్ పోరాటం

సారథి న్యూస్, హుస్నాబాద్: దళితుల హక్కుల సాధనకు ఎమ్మార్పీఎస్ నిరంతర పోరాటాలు చేస్తుందని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జేపీ లత అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగరవేసి మాట్లాడారు. మాదిగలంతా ఏకతాటిపైకి వచ్చి ఏబీసీడీ వర్గీకరణకు పోరాడలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వృద్ధాప్య, వితంతువులు, వికలాంగుల పెన్షన్, ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలు మంద కృష్ణ మాదిగ పోరాటాల ఫలితమేనన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్​చార్జ్​ వెంకటస్వామి, నాయకులు లక్ష్మీనారాయణ, […]

Read More