Breaking News

కాంగ్రెస్

ప్రాణాలు పోతున్నయ్.. గుంతలు పూడ్చండి

ప్రాణాలు పోతున్నయ్.. గుంతలు పూడ్చండి

సారథి న్యూస్, హుస్నాబాద్: రోడ్లపై గుంతలు ఎక్కువగా పడడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే గుంతలను పూడ్చాలని కాంగ్రెస్ హుస్నాబాద్​ మండలాధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ అన్నారు. రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్​ చేస్తూ శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. హన్మకొండ నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రానికి వెళ్లే మెయిన్​రోడ్డు దెబ్బతినడంతో నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అన్నారు. ఆ గుంతల్లో జూలై 7న జెండాలు పాతి నిరసన తెలిపినా మంత్రి, అధికారులకు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా […]

Read More
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి

స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి

సారథి న్యూస్​, గోదావరిఖని: స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ కు వచ్చిన కేంద్ర రసాయన ఎరువులశాఖ సహాయ మంత్రి మాన్సుఖ్ మాండవియా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్​ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. వారిలో కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్​చార్జ్​ఎంఎస్ రాజ్ ఠాకూర్, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, గాదం నందు, ఫక్రుద్దిన్, నగునూరి రాజు, పెండ్యాల మహేష్, నాజిమొద్దిన్, కౌటం సతీష్​ పాల్గొన్నారు.

Read More
ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారు

ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారు

దోపిడే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది ఉత్సవ విగ్రహంలా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల సీఎల్పీ లీడర్​ మల్లు భట్టి విక్రమార్క ధ్వజం సారథి న్యూస్, మెదక్: సీఎం కె.చంద్రశేఖర్​రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి దోపిడే ధ్యేయంగా పనిచేస్తోందని సీఎల్పీ లీడర్​మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మెదక్​ప్రభుత్వాసుపత్రిని సందర్శించి కరోనా రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విపత్తు సమయంలో సర్వ […]

Read More

సోనియమ్మకే మళ్లీ పగ్గాలు

ఢిల్లీ: కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగకుండానే కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ భేటీ ముగిసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగించాలని కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఊహాగానాలు వెల్లువెత్తడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే పలు నాటకీయ పరిణామాల మధ్య సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సోనియాగాంధీ పేరును పార్టీ సీనియర్​ నాయకులు మన్మోహన్​ […]

Read More

సోనియా గాంధీ రాజీనామా?

హైదరాబాద్‌ : ఏఐసీసీ (ఆల్​ ఇండియా కాంగ్రెస్​ కమిటీ) అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కాంగ్రెస్​ అధ్యక్షపదవి నుంచి రాహుల్​ తప్పుకోవడంతో.. ప్రస్తుతం సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సీనియర్ల ఒత్తిడి మేరకు సోనియా పదవి బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఆరోగ్యసమస్యలు వేధించడం, తదితర కారణాలతో ఆమె పార్టీకి పూర్వవైభవం తీసుకురాలేకపోయారు. ఈ […]

Read More

సోనియాకు సీనియర్ల ఘాటు ‘లేఖ’

సారథిమీడియా, హైదరాబాద్​: ఏఐసీసీ (ఆల్​ఇండియా కాంగ్రెస్​ కమిటీ) తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీకి ఆ పార్టీలోని సీనియర్లు ఓ ఘాటు లేఖను రాశారు. సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం జరుగునున్న నేపథ్యంలో ఈ లేఖ వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ప్రస్తుత విపత్కకర పరిస్థితుల్లో పార్టీని బతికించాలని.. అందుకోసం పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టాలని లేఖలో కాంగ్రెస్​ సీనియర్లు కోరారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నదని.. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ లేఖ మీద కాంగ్రెస్​ […]

Read More
మీరైనా జోక్యం చేసుకోండి

మీరైనా జోక్యం చేసుకోండి

పాలనలో తప్పులు ఎత్తిచూపే వారిని వేధిస్తున్నారు పవర్​హౌస్ ​ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి గవర్నర్‌ తమిళిసై సౌందర్​రాజన్​కు రేవంత్ రెడ్డి లేఖ హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్​రాజన్ కు శనివారం లేఖ రాశారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రజలకు గవర్నర్ హోదాలో మీరు ఇటీవల స్పందించిన తీరు కొంత ఊరట కలిగించిందన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు.. ‘రాష్ట్రంలో రాజ్యాంగ, పౌర, […]

Read More
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం విషమం

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్​ నేత ప్రణబ్‌ ముఖర్జీ(84) ఆరోగ్యం విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్లు ఏఎన్ఐ తెలిపింది. ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్‌లో ప్రస్తుతం ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స చేశారని వార్తాసంస్థలు వెల్లడించాయి. తనకు కరోనా సోకిందని ప్రణబ్ ముఖర్జీ సోమవారం ట్వీట్ చేశారు. వేరే చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడ కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, […]

Read More