Breaking News

క్రైమ్

ముగ్గురిని బలిగొన్న నిర్లక్ష్యం

సారథిన్యూస్​, సూర్యాపేట: కాలకృత్యాలు తీర్చుకొనేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉన్న ముగ్గురిని కారు ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా కృత్తివేలు మండలం ఇంటెరు గ్రామానికి చెందిన నాగ కోటేశ్వరరావు, దుర్గ, మొగులమ్మ, కొండబాబు శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్​కు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద కారు ఆపారు. వారు రోడ్డు పక్కన నిలబడి ఉండగా వెనుకనుంచి మరో కారు […]

Read More
కరోనా పేషెంట్​పై లైంగికదాడి

కరోనా పేషెంట్​పై లైంగికదాడికి యత్నం

ఢిల్లీ: కరోనాతో బాధపడుతూ దవాఖానలో చేరిన ఓ బాలిక(14)ను మరో కరోనా పేషెంట్​ లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని కోవిడ్ కేర్​సెంటర్​లో గురువారం వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన ఓ బాలికకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో కోవిడ్ సెంటర్​లో చికిత్సపొందుతున్నది. కాగా అక్కడే చికిత్సపొందుతున్న మరో కరోనా బాధితుడు బాలికపై టాయిలెట్​రూంలో లైంగికదాడికి యత్నించాడు. ఈ దృశ్యాన్ని మరో వ్యక్తి తన మొబైల్​ ఫోన్​లో చిత్రీకరించాడు. బాలిక కేకలు పెట్టడంతో ఇతర రోగులు అక్కడికి […]

Read More

బావ ప్లాన్​.. మరదలు అప్లై

సారథి న్యూస్​, హైదరాబాద్‌: నడిపేది ట్రాలీ ఆటో.. జీవన శైలిలో విలాసవంతమైన మార్పు. అప్పులు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి చేరిక.. 2.35 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు.. ఇదంతా ఎలా సాధ్యమంటూ ఆరా తీస్తే.. అసలు సంగతి తెలిసి ఔరా అంటూ ఎల్బీనగర్‌ పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. మరదలితో చోరీ చేయించి.. ఆ డబ్బుతో జల్సా చేస్తున్న బావ ఆట కట్టించారు. రూ.25.5 లక్షలు, రూ.22 లక్షల విలువైన వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను […]

Read More
సీరియల్​ నటి ఆత్మహత్య

సీరియల్​ నటి ఆత్మహత్య

అప్పులబాధ భరించలేక ఓ సీరియల్ నటి, గాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి కొంతకాలం టీవీ సీరియల్స్​ నటించింది. తర్వాత అవకాశాలు తగ్గడంతో గుంటూరుకు వెళ్లింది. అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్య అనే రియల్​ఎస్టేట్​ వ్యాపారిని వివాహం చేసుకున్నారు. గుంటూర్​ విద్యానగర్​లో ఉంటున్న రేఖ పెళ్లి వేడుకల్లో పాటలు పాడటం, యాంకరింగ్ […]

Read More

పేదలబియ్యం పక్కదారి

సారథిన్యూస్​, కోడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని దారిమళ్లించి సొమ్ము చేసుకోవాలనుకున్న ఓ రేషన్​డీలర్​ భర్తను పోలీసులు అరెస్ట్​ చేశారు. కోడేరు మండల కేంద్రంలోని రేషన్​షాప్​నెంబర్​ 3 డీలర్​ శారద భర్త శ్రీనివాసులు 95 కిలోల బియ్యాన్ని దారి మళ్లించాడు. కోడేరు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై పౌరసరఫరాల సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశామని డీలర్ ను అదుపులోకి తీసుకున్నామని పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్ బాబు తెలిపారు.

Read More

కోవిడ్​ సెంటర్​లో లైంగికదాడి

ముంబై: కరోనాతో లక్షణాలతో కోవిడ్​ సెంటర్​లో చేరిన ఓ మహిళపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ హేయమైన ఘటన ముంబైలో చోటుచేసుకున్నది. కరోనా లక్షణాలతో ఓ మహిళ(40) నేవీ ముంబైలోని కోవిడ్​ సెంటర్​లో చేరింది. మహిళ రెండోఅంతస్థులో ఉండగా.. డాక్టర్​గా పరిచయం చేసుకున్న ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. సదరు యువకుడు కూడా అదే కోవిడ్​ సెంటర్​లో ఐదోఅంతస్థులో చికిత్సపొందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read More
దళిత యువకుడి దారుణ హత్య

దళిత యువకుడి దారుణ హత్య

సారథి న్యూస్, కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మర్రిపల్లి గ్రామంలో దళిత యువకుడు ఈర్లపల్లి కిరణ్ (28)ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా గొడ్డలితో నరికిచంపారు. ఈ ఘటన శుక్రవారం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యోదంతంపై లోతైన విచారణ సాగిస్తున్నారు.

Read More
రూ.1.8 కోట్ల నగదు సీజ్​

రూ.1.8 కోట్ల నగదు సీజ్​

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల టోల్ గేట్ వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.1.80 కోట్ల నగదును పాణ్యం పోలీసులు శుక్రవారం సీజ్​చేశారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ కు కారులో ఈ డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన డబ్బును ఇన్​కంటాక్స్​అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు. నగదును తరలిస్తున్న దత్తాత్రేయ విఠల్ ను విచారించగా హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ కు హాస్పిటల్ కు తీసుకెళ్తున్నట్లు చెప్పాడని పాణ్యం సీఐ జీవన్ గంగానాథ్​బాబు తెలిపారు.

Read More