Breaking News

Month: January 2021

కరోనా వ్యాక్సిన్​ వచ్చేసింది..

కరోనా వ్యాక్సిన్ ​వచ్చేసింది..

సారథి న్యూస్, మెదక్: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ మన చెంతకు వచ్చేసింది. శనివారం మెదక్ ​జిల్లా ప్రధాన ఆస్పత్రిలో మొదటి ప్రాధాన్యతగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్-19 టీకా వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​ హేమలత శేఖర్​గౌడ్ ​ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ మీట్ లో పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనాను నియంత్రించేందుకు టీకా వేసే కార్యక్రమం ప్రారంభించుకోవడం అద్భుతమని అన్నారు. ఇమ్యునిటీని పెంచే […]

Read More
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉండడం అదృష్టం

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉండడం అదృష్టం

సారథి న్యూస్​, మానవపాడు: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి గొప్ప వ్యక్తి గురుకులాలకు సెక్రటరీగా ఉండడం ఈ ప్రాంత విద్యార్థుల అదృష్టమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని ఆయన అన్నారు. అలంపూర్​ లో నిర్వహించిన స్వేరోస్​ సంబరాల్లో గురువారం ఉదయం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మొదట […]

Read More
గంగపుత్రులకు మంత్రి సారి చెప్పాలే

గంగపుత్రులకు మంత్రి సారి చెప్పాలే

సారథి న్యూస్, నిజాంపేట: గంగపుత్రులకు మంత్రి శ్రీనివాస్​యాదవ్​క్షమాపణ చెప్పాలని సంఘం నేతలు డిమాండ్​చేశారు. తమ వృత్తిని ముదిరాజ్​ కులస్తులకు అప్పగించే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో గంగపుత్ర యువత, గంగపుత్రుల్లో ఉన్న మేధావి వర్గాలతో చర్చించి ఒక కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే చెరువులు, కుంటలు గంగపుత్రుల చేతుల్లోనే ఉండేవని గుర్తుచేశారు. ముదిరాజ్ ఆత్మగౌరవ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే […]

Read More
సూరారంలో ముగ్గుల పోటీలు

సూరారంలో ముగ్గుల పోటీలు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ద్వారక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మ్యాడం బాలకృష్ణ హాజరై పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీలో వరుసగా పద్మగల్ల లక్ష్మి, కుమ్మరి నవ్య, నిమ్మగల్ల సరిత, నిమ్మగల్ల విజయ మొదటి, రెండవ, మూడవ, నాలుగవ బహుమతులను గెలుచుకున్నారు. మహిళలను చైతన్యపరిచేందుకు పోటీలు నిర్వహించామని గ్రామ సర్పంచ్ నీరజ పవన్ […]

Read More
కొట్రలో భజన కళాబృందం సంబరాలు

కొట్రలో భజన కళాబృందం సంబరాలు

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో జానపద, పౌరాణిక నాటక భజన కళాబృందం కళాకారులు కేక్ ​కట్​చేసి సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కరోనా కష్టకాలంలో కళాకారులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ కష్టాలు ఇక తొలగిపోయినట్టేనని పేర్కొన్నారు. జానపద, పౌరాణిక నాటక రంగాన్ని కాపాడుతున్న కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కళాక్షేత్రాలు, సినిమా థియేటర్లను ఓపెన్​ చేయడంతో కళాకారులకు మంచిరోజులు వచ్చాయని అన్నారు. టీవీలు, సెల్ ఫోన్లు, సినిమాలు […]

Read More
మా పొలాల గుండా గ్యాస్​పైప్​లైన్ వద్దు

మా పొలాల గుండా గ్యాస్​పైప్​ లైన్ వద్దు

సారథి న్యూస్, మానవపాడు: తమ వ్యవసాయ పంట పొలాల గుండా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారు గ్యాస్ పైప్ లైన్ వేయొద్దని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు గ్రామస్తులు రాయచూర్– కర్నూలు అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు. తక్షణమే గ్యాస్ పైప్​ లైన్​ పనులను ఆపివేయాలని డిమాండ్​ చేశారు. పైప్​లైన్​ద్వారా ప్రాణనష్టం వాటిల్లుతుందన్నారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్​ స్తంభించిపోయింది. పోలీసు అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.

Read More
అనంతపురంలో బర్డ్​ఫ్లూ కలకలం

అనంతపురంలో బర్డ్​ ఫ్లూ కలకలం

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: పక్షులు, కోళ్లను బర్డ్​ఫ్లూ మహమ్మారి కబళిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీ రైతులను వణికిస్తోంది. క్రమంగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా బర్డ్​ఫ్లూ మహమ్మారి పాకినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామంలో ఉన్నట్టుండి 20 నుంచి 30 నాటుకోళ్లు ఒకేరోజు చనిపోవడం కలకలం రేపింది. ఈ కోళ్లకు బర్డ్​ఫ్లూ వచ్చిందా? మరేదైనా కారణమా? అని బాధిత పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత […]

Read More
సంక్రాంతి వేళ విషాదం

సంక్రాంతి వేళ విషాదం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సంక్రాంతి పండుగ పూట ఈ విషాదకర ఘటన బుధవారం సాయంత్రం చిన్నశంకరంపేట గ్రామశివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన నిమ్మతోట ఆంజనేయులు(38) చిన్నశంకరంపేటలో వీక్లీ మార్కెట్ ముగించుకుని ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. చిన్నశంకరంపేట – అంబాజీపేట గ్రామాల సరిహద్దు కల్వర్టుపై మెదక్ నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఎక్సెల్ పై వెళ్తున్న ఆంజనేయులు తలకు తీవ్ర […]

Read More