నదీ జలాల విషయంలో కావాలనే ఏపీ కయ్యం నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకుని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం […]
యోగికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్రమోడీ లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ దళిత యువతి సామూహిక లైంగికదాడి కేసులో దోషులుగా తేలినవారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఈ ఘటన గురించి ప్రధాని మోడీ తనతో మాట్లాడారనీ, దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారని యోగి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లు చేశారు. యోగి స్పందిస్తూ.. ‘ఈ ఘటనకు […]
సుశాంత్ డెత్ కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారింది. టోటల్ సినిమా ఇండస్ట్రీలోనే కలకలంగా మారిన ఈ నార్కొటిక్స్ కలవరం మరో దారి పడుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ డ్రగ్స్ కేసులో సెక్స్ రాకెట్ కోణం కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన గల్రానీల మొబైల్ ఫోన్ల నుంచి అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. ఇద్దరి మొబైల్ ఫోన్ల […]
బతకడానికి పనిచేయడం మాత్రమే ఆస్తిగా ఉన్న జీవితాలు వాళ్లవి. చదువులూ, సంపదలూ లేకున్నా ఎలాగైనా బతకగలమనే నమ్మకమే వాళ్లను ఇన్నాళ్లూ నడిపించింది. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ను నమ్ముకుని ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న తల్లులు వాళ్లు. ఇప్పుడా ఆత్మవిశ్వాసం మీదే దెబ్బపడింది. ఎలాగైనా బతకగలం అనే నమ్మకం సడలిపోతోంది. చేయడానికి పనిలేకుంటే తినడానికి తిండీ ఉండదన్న నిజానికి సాక్ష్యంగా ఇప్పుడు ఆకలిని, ఆశలను ఎలా తీర్చుకోవాలో అర్థం కాకుండా నిలబడ్డారు. కరోనా వాళ్ల శరీరాలను తాకకుండానే జీవితాలని దెబ్బతీసింది. శక్తి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని బార్లు, క్లబ్బుల యజమానులకు ఊరట లభించింది. కరోనా లాక్డౌన్ కారణంగా బార్లు, కబ్బులను మూసివేయాలని ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఇప్పటికే వైన్ షాపులు తెరుచుకోగా, మొత్తానికి దాదాపు ఆరు నెలల కాలం తర్వాత తెలంగాణలో బార్లు, క్లబ్బులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్ రూమ్లకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. బార్లు, క్లబ్బులలో మ్యూజికల్ ఈవెంట్స్, డ్యాన్స్లను […]
సారథి న్యూస్, మల్దకల్: గ్రామాల అభివృద్దిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆమె మల్దకల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఫైళ్లను పరిశీలించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి అడిగి తెలుసుకున్నారు.
తమిళనాడులో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.. ఇటీవల పలువురు సినీ, రాజకీయప్రముఖుల ఇంట్లో బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్లు రావడం.. తీరా పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేపడితే ఏమీ దొరకపోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే సూపర్స్టార్ రజినీకాంత్, అజిత్, మణిరత్నం, విజయ్ తదితరుల ఇంట్లో బాంబులు పెట్టామంటూ ఆకతాయిలు ఫోన్లు చేశారు. విచారించిన పోలీసులకు అవన్నీ ఫేక్కాల్స్ అని తేలింది. అయితే తాజాగా ప్రముఖ హీరో ఇంట్లో బాంబులు పెట్టామంటూ పోలీసులకు బెదిరింపులు వచ్చాయి. చెన్నై అల్వార్పేట ఏరియాలో […]
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శనగర్ గ్రామం నుంచి గంగాధర వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. ఇటీవల, గతంలో కురిసిన వర్షాలకు చిత్తడిగా మారింది. రోడ్డు పొడవునా గుంతలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా పాలకులు పట్టించకొని మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.