Breaking News

Day: September 6, 2020

వామ్మో కరోనా కబలిస్తోంది..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లోనే దాదాపు 90,632 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు 1065 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులసంఖ్య 41,13,811 కు పెరిగింది. ప్రస్తుతం 8,62,320 యాక్టివ్​ కేసులు ఉండగా.. 70,626 మంది మృత్యువాత పడ్డారు. కాగా కొంత ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ఇప్పటివరకు 31,80,865 మంది కోలుకున్నారు. టెస్టులు ఎక్కువగా చేస్తున్నందునే.. ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ […]

Read More

సైకో భర్త నీచపు కోరికలు.. భార్య ఆత్మహత్య

పుణే: సైకో భర్త నీచమైన లైంగికకోరికలు తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మద్యం, డ్రగ్స్​కు బానిసైన ఈ నీచుడు ఫోర్న్​ సినిమా తరహాలో సెక్స్​ కావాలంటూ భార్యను వేధించేవాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో శాడిస్ట్​ మొగుడి టార్చర్​ తట్టుకోలేక.. పుట్టింటికి వచ్చిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మహారాష్ట్రలోని పూణెకు చెందిన రతన్ లాల్​కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కూతురును 2019లో లండన్​లో ఉద్యోగం చేస్తున్న […]

Read More

టీకా ఇప్పట్లో రాదు.. ట్రంప్​వి అబద్ధాలు

వాషింగ్టన్​: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై.. కమలా హారిస్​ నిప్పులు చెరిగారు. డెమొక్రాటిక్​ తరఫున కమల ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్​ విషయంలో ట్రంప్​ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒక వేళ ఆయన చెప్పిన తేదీకి వ్యాక్సిన్​ వచ్చినా.. దాని సేఫ్టీ విషయాన్ని నమ్మలేమన్నారు. మరోవైపు కరోనా కట్టడిలో ట్రంప్​ ఘోరంగా ఫెయిల్​ అయ్యారని డెమోక్రాట్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవంబర్​ 1నాటికి వ్యాక్సిన్​ […]

Read More
చేనేత కార్మికులపై కరోనాదెబ్బ

చేనేత కార్మికులను ఆదుకోని ‘త్రిఫ్ట్​ ఫండ్​’

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా కాలంలో చేనేత, మరమగ్గాల కార్మికులను ఆదుకోవాలన్న ప్రభుత్వ ఉద్దేశం పూర్తిగా నెరవేరకుండా పోతోంది. బ్యాంకుల నిబంధనలు వారికి రావాల్సిన డబ్బును అడ్డుకుంటున్నాయి. పలు రకాల కొర్రీలు, బుక్‌ అడ్జెస్ట్‌మెంట్ల వల్ల రాష్ట్రంలోని 4,200 మంది కార్మికులు తమకు అందాల్సిన సొమ్మును పొందలేకపోతున్నారు. చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం కోసం 2018లో రాష్ట్ర ప్రభుత్వం త్రిఫ్ట్‌ ఫండ్‌ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. 18వేల మంది చేనేత, 12 మంది పవర్‌లూమ్‌ కార్మికులు ఇందులో […]

Read More

రియా అరెస్ట్​​.. ఎన్​​సీబీకి కీలక ఆధారాలు

సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ కేసు చివరికి రియా చక్రవర్తి మెడకు చుట్టుకుంటున్నది. ఈ కేసులో తాజాగా డ్రగ్స్​ కోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. రియా డ్రగ్స్​ కొనుగోలు చేసి.. సుశాంత్​కు అందించినట్టు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. రియా డ్రగ్స్​ కొనుగోలు చేసినట్టు సీబీఐకి కీలక ఆధారాలు దొరికాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే సుశాంత్​ మేనేజర్​ శామ్యూల్​, రియా సోదరుడు షోవిక్​ను ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. ఆదివారం రియాను […]

Read More