Breaking News

Month: July 2020

జర్నలిస్టులను అన్ని విధాల ఆదుకుంటున్నాం

337 మంది జర్నలిస్టులకు సాయం

సారథిన్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడ్డ 337 మంది జర్నలిస్టులకు రూ. 59 లక్షల 30 వేల రూపాయలు ఆర్థికసాయం అందించామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్​ అల్లం నారాయణ వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన 256 మందికి 20 వేల రూపాయల చొప్పున, 51 లక్షల 20 వేల రూపాయలు, హోం క్వారంటైన్ లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు పదివేల రూపాయల చొప్పున 8 లక్షల 10 వేల రూపాయలను అందిచామన్నారు. జర్నలిస్టులు ఎవరికైనా […]

Read More

అనుమానమే పెనుభూతమై..

సారథి న్యూస్​, చిత్తూరు : చిత్తూరు జిల్లా వి కోట మండలం పాముగానిపల్లిలో అనుమానం పెనుభూతమై పచ్చని కాపురంలో చిచ్చు రగిలింది. తాగుడుకు బానిసైన భర్త ప్రభాకర్​ రెడ్డి (32)  భార్య రేణుక (22)పై అనుమానం పెంచుకుని సోమవారం ఉదయం భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డారు. పాముగానిపల్లె సమీపంలోని పొలం వద్ద ఇరువురు ఘర్షణ పడి కోపంతో వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు. ఆమె స్పాట్​లోనే చనిపోయింది. అనంతరం అతను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. […]

Read More
జగదీష్ రెడీ అయిపోతున్నాడు..

జగదీష్ రెడీ అయిపోతున్నాడు..

షూటింగ్స్ బంద్ అయి నాలుగు నెలలు గడిచింది. అన్ని సినిమాలు కూడా వాయిదా పడిపోయాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం పరిస్థితులు చక్కబడిన వెంటనే రిలీజ్ అయిపోనున్నాయట. దానికోసం కొంతమంది తెలివైన నిర్మాతలు మాత్రం ఈ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో నాని నటిస్తున్న ‘టక్ జగదీష్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. తమిళనాడు […]

Read More
వైభవంగా నితిన్​, షాలినీ పెండ్లి

వైభవంగా నితిన్​, షాలినీ పెండ్లి

హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జులై 26 ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్, షాలినీ ల పెళ్లి వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ అతికొద్దిమంది ఆత్మీయులు సన్నిహితుల సమక్షంలో పెద్దలు అంగరంగవైభవంగా జరిపించారు ఈ వేడుకను. ఈ పెళ్లి కి సినీ ఇండస్ట్రీ నుంచి నితిన్ బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, హీరో కార్తికేయ హాజరయ్యారు. ఈ అలాగే ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా […]

Read More
తెలంగాణలో కరోనాతో 8 మంది మృతి

తెలంగాణలో కరోనాతో 8 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొత్తగా 1,473 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 55,532 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 471 మంది మృత్యువాతపడ్డారు. చికిత్స అనంతరం 42,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,955కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 506 నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 168, వరంగల్​ అర్బన్​111, […]

Read More
కాలం మారింది

కాలం మారింది

భార్యను కాపురానికి పంపాలంటూ భర్త మౌనపోరాటం సారథి న్యూస్​, మంచిర్యాల: భర్త ఇంటి ముందు భార్య మౌనపోరాటం చేయటం కామన్ కానీ భార్య ఇంటి ముందు భర్త న్యాయపోరాటం చేయడం వెరైటీ..అలాంటి వెరైటీ ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భర్త తనకు న్యాయం చేయాలని తన భార్య ఇంటి ముందు మౌనపోరాటానికి దిగాడు. వివరాల్లోకి వెళితే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌లో ఒరుగంటి రాంక‌ర‌ణ్ అనే వ్యక్తి త‌న భార్యను కాపురానికి పంపాలంటూ […]

Read More
కోవిడ్ వార్డుల తనిఖీ

కోవిడ్ వార్డుల తనిఖీ

సారథి న్యూస్​, అనంతపురం : జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలోని కోవిడ్-19 ఐసీయూ,ఇతర వార్డులను సోమవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వైద్యులు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి కోవిడ్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలు ఏ విధమైన భయాందోళనలకు లోను కావద్దని ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందన్నారు.

Read More
కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

 ప్రజల్లో ధైర్యాన్ని నింపండి తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ…మీడియా, సోషల్ మీడియాకు విజ్ఞప్తి  సారథి న్యూస్​, హైదరాబాద్: మనమంతా మనుషులం..సాటి మనుషుల మీద మానవత్వాన్ని చాటుదాం. మన తోటి వాళ్లందరినీ గౌరవిద్దాం. మరీ ముఖ్యంగా కరోనా పేషంట్లని కరుణతో చూద్దాం. కరోనా బాధిత శవాలకు గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించేలా అనుమతిద్దాం…అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రంలో తనతోపాటు విస్తృతంగా తిరిగిన తన సిబ్బందిలో కొందరికి పాజిటివ్ […]

Read More