సారథిన్యూస్, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం ఆశయాలు కొనసాగిద్దామని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్రాజన్ పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని యువత అలవర్చుకోవాలని సూచించారు. కలాం ఐదో వర్ధంతి సందర్భంగా సోమవారం రాజ్భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తమిళనాడులోని కలాం బంధువులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
డబుల్ బెడ్రూం ఇళ్లంటూ ఘరానా మోసం జనాల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు మాదాపూర్, కూకట్పల్లి ఎస్.ఓ.టీ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో బట్టబయలు సారథి న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రుమ్ పథకాన్ని అడ్డు పెట్టుకొని కొందరు వ్యక్తులు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన గూతుల. ప్రశాంత్(విజన్-1టీవీ ఛానెల్ చైర్మన్ తండ్రి లక్ష్మీనారాయణ) అనే వ్యక్తి కూకట్పల్లి హౌసింగ్ […]
న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేసేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఉద్యోగులకు ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్క్ప్రంహోం విధానాన్ని మరిన్ని రోజులు పొడగించింది. జూలై 2021 వరకు తమసంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్ప్రంహోంను పొడగిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఉద్యోగులకు కోసం వర్క్ఫ్రం హోమ్ను పొడిగించిన తొలి కంపెనీ గూగుల్యే కావడం విశేషం. కాగా ఈ కంపెనీలో దాదాపుగా 2లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అయోధ్య: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో భక్తులెవరూ అయోధ్యకు రావొద్దని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కోరారు. ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో చంపత్ రాయ్ ఈ ప్రకటన చేశారు. దేశంలోని భక్తులందరూ తమ ఇంట్లోనే ఆరోజు పూజలు చేసుకోవాలని సూచించారు. రామమందిర శంకుస్థాపన చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పారు. కరోనా విపత్తువేళ కేవలం పరిమితమైన సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించినట్టు ఆయన చెప్పారు.
సారథి న్యూస్, తిరుమల: శ్రీవారు.. ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడు. ఇది కరోనా కాలం కంటే ముందు. కానీ ఇప్పుడు కరోనా కాలంలో శ్రీవారి హుండీకి గండి పడింది. తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారు కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలు గట్టెక్కించడానికి తిరుమలలో వెలిశారు. స్వామివారిని ఏడాదికి రెండున్నర కోట్ల మందిపైగా భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు ఎప్పటికప్పుడు రికార్డు బద్దలుకొట్టేసేది. కానీ ఇప్పుడు రికార్డులే లేవు. మొదట్లో వేల రూపాయలతో […]
సారథిన్యూస్, రామడుగు: కరోనాను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నదని ఆరోపించారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తికి బాధ్యత వహిస్తూ మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమాలాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి […]
సారథిన్యూస్, రామడుగు: తమకు ఇష్టమైన రాజకీయ నాయకుల పుట్టినరోజులకు పోటీపడి ఉత్సవాలు చేసే నాయకులు.. మహనీయుడైన అబ్దుల్ కలాం వర్ధంతిని మరిచారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పలుచోట్ల కలాంకు వివిధ పార్టీల నాయకులు నివాళి అర్పించారు. కానీ కరీంనగర్ జిల్లా రామడుగులో మాత్రం నేతలు కలాంను మరిచిపోయారు. ఒక పువ్వు పెట్టి నివాళి అర్పించే సమయం కూడా వారికి లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులను ప్రసన్నం చేసుకోవడం తగ్గించి.. దేశానికి సేవచేసిన మహనీయులను […]
న్యూఢిల్లీ : అయోధ్య రామమందిర నిర్మాణ భూమిపూజకు ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయోధ్య రామమందిర భూమిపూజకు హాజరు కావల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ మోదీకి ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ప్రధానితో పాటు మరో 250 మంది అతిథులు కూడా హాజరుకాన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందు పరిషత్ సీనియర్ ప్రతినిధులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ […]