Breaking News

రాజ్​భవన్​లో కలాం వర్ధంతి

రాజ్​భవన్​లో కలాం వర్ధంతి

సారథిన్యూస్​, హైదరాబాద్​: మాజీ రాష్ట్రపతి అబ్ధుల్​ కలాం ఆశయాలు కొనసాగిద్దామని తెలంగాణ గవర్నర్​ తమిళ సై సౌందర్​రాజన్​ పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని యువత అలవర్చుకోవాలని సూచించారు. కలాం ఐదో వర్ధంతి సందర్భంగా సోమవారం రాజ్​భవన్​లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తమిళనాడులోని కలాం బంధువులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు.