సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని అందుకు సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట మండలం, మెదక్ పట్టణంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం యూసుఫ్ పేటలో డబుల్ బెడ్రూమ్ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పట్టణాలకు దీటుగా గ్రామాలను తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలు […]
న్యూఢిల్లీ: మన దేశంలోని సైబర్ సెక్యూరిటీ నోడల్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్కు నోటీసులు జారీచేసింది. ఇటీవల హై ప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్కు గురైన విషయంపై పూర్తి వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్లు ఏజెన్సీలోని ఒక అధికారి మీడియాతో చెప్పారు. హ్యాకర్లు పెట్టిన లింక్లను సందర్శించిన భారతీయ వినియోగదారుల సంఖ్య, వారికి కలిగిన నష్టం గురించి, ఆ అకౌంట్ల గురించి వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నాయి. శనివారం కొత్తగా 1,284 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 43,780 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 1,902 మంది రికవరీ అయ్యారు. మహమ్మారి బారినపడి ఒకేరోజు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 430 మంది చనిపోయారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 667, రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్ 62, సంగారెడ్డి 86, ఖమ్మం 10, వరంగల్అర్బన్37, కరీంనగర్58, యాదాద్రి భువనగిరి 10, పెద్దపల్లి […]
సారథి న్యూస్, నాగర్కర్నూల్: తేనె సేకరణకు వెళ్లిన ఇద్దరు చెంచు యువకులు చెట్టుకు కట్టిన తాగు తెగిపోయి లోయలోపడి చనిపోయారు. ఈ దుర్ఘటన శనివారం నాగర్కర్నూల్జిల్లా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి సమీప అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆదివాసీ చెంచులు దాసరి బయన్న(35), దాసరి పెద్దలు(28), దాసరి వెంకటయ్య కలిసి నల్లమల అటవీ ప్రాంతంలోకి తేనె సేకరణకు వెళ్లారు. చెట్టుకు కట్టిన తాడు ప్రమాదవశాత్తు తెగిపోవడంతో ముగ్గురూ లోయలో పడిపోయారు. వారిలో దాసరి బయన్న, దాసరి […]
సారథిన్యూస్, రామడుగు: కరోనాను వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజమల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాను అదుపుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. లాక్డౌన్ ఎత్తివేయడంతోనే కరోనా విజృంభించిందని పేర్కొన్నారు. లాక్డౌన్ను పటిష్ఠంగా అమలుచేసి ఉపాధి కోల్పోయినవారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గోదావరిఖని: ముంబైలోని అంబేద్కర్ ఇల్లు( రాజగృహ) పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నిందితులను గుర్తించడంలో మహారాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించకపోతే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అన్ని దళితసంఘాలను కలుపుకుపోయి దేశవ్యాప్త ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ నాయకులు మంతని సామిల్ […]
సారథిన్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన ఎనిమిది మందికి రూ. లక్ష 98 వేల విలువైన సీఎం సహాయకనిధి చెక్కులను శనివారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగులో రామాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని బీజేపీ నాయకులు శనివారం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని నర్సింగరావు చెరువు లో గుండు పై రాముని పాదుకలు ఉండటం వల్ల రామడుగు అనే పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి ఒక ఎకరం శిఖం భూమి కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో పురేళ్ల శ్రీకాంత్, అనుపురం పరుశరాం, శివ, భరత్, నరేశ్, సురేశ్ […]