సారథి న్యూస్, హుస్నాబాద్: అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో ఆర్డీవో జయచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్, తోటపల్లి ఊర చెరువుల నుంచి కొంతమంది రాత్రుళ్లు జేసీబీలతో తవ్వుతూ ట్రాక్టర్లతో మట్టి తరలిస్తు సొమ్ముచేసుకుంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వనేశ్, […]
సారథి న్యూస్, హుస్నాబాద్/ బిజినేపల్లి: మొక్కలే జీవకోటికి ప్రాణాధారమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వెంకటేశ్వర దేవాలయం ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన చెట్లను పరిరక్షించాలని కోరారు. కాగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 5,7,17 వ వార్డుల్లో మున్సిపల్ చైర్పర్యన్ ఆకుల రజిత మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో హుస్నాబాద్ వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు […]
సారథి న్యూస్, రామాయంపేట: జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలను 200 రోజులకు పెంచాలని దళిత బహుజలన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పీ శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం నిజాంపేట మండలం చల్మెడలో జాతీయ ఉపాధి హామీ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాక్ డౌన్ తో నిరుద్యోగం పెరిగి లక్షలమంది గ్రామాలకు తిరిగి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఆర్సీ జిల్లా కో ఆర్డినేటర్ దుబాషి సంజివ్ బుచ్చయ్య, మల్లేశం, పరుశరాములు, స్వామి, […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని కరోనా కేసులు రోజు రోజుకూ రెట్టింపు అవుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, రాష్ట్రంలో చాలా తక్కువ టెస్టులు చేస్తున్నారని ఇందులో కూడా పారదర్శకత లేదన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 32.1 శాతంగా ఉందని ఆయన ఆందోళన […]
సారథి న్యూస్, మెదక్: అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మెదక్ జిల్లాను ముందంజలో నిలపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. అందుకోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేయాలని కోరారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెదక్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, రైతు వేదికలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణాల్లో తడి, పొడి చెత్తపై […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా పాజిటివ్కేసులు పెరుగుతున్నాయి. సోమవారం ఒకే రోజు 793 మంది పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,891కు చేరింది. యాక్టివ్ కేసు 7,479, ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారు 6,232 మంది ఉన్నారు. కరోనాతో 180 మంది మృతిచెందారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం జిల్లాలో 96, చిత్తూరు 56, తూర్పుగోదావరి 72, గుంటూరు 98, కడప 71, కృష్ణా 52, కర్నూలు 86, నెల్లూరు 24, […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జూలై 1న తొలి ఏకాదశి పర్వదినాన్ని మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి రాకుండా ఇళ్లల్లోనే జరుపుకోవాలని ఎక్సైజ్శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కోరారు. సోమవారం ఆయన విలేకరులో మాట్లాడారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకి రాకుండా ఇంట్లోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని మాస్క్ తప్పనిసరిగా ధరించాలని మంత్రి సూచించారు.
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు పోలీసు సంక్షేమంలో భాగంగా 55 ఏళ్లు పైబడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి హెల్త్ కండీషన్ను పరీక్షించేందుకు సోమవారం 150 పల్స్ ఆక్సీమీటర్లను పంపిణీ చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లు, సర్కిల్ఆఫీసులు, డీఎస్పీ ఆఫీసులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చినట్లు తెలిపారు. పల్స్ ఆక్సీమీటర్ ద్వారా ముందస్తుగా కరోనా లక్షణాలను తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నాన్ కేడర్ ఎస్పీ ఆంజనేయులు, ఎఆర్ […]