Breaking News

Month: June 2020

రెండు నెలల్లో రైతువేదికలు పూర్తి

రెండు నెలల్లో రైతువేదికలు పూర్తి

సారథి న్యూస్, మహబూబ్​నగర్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతి గ్రామంలో రైతు వేదికలు నిర్వహించాలని నిర్ణయించిందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు చెప్పారు. క్షేత్రస్థాయి అధికారులంతా సమష్టి కృషితో వ్యవహరించి రెండు నెలల్లో ఈ రైతు వేదికల నిర్మాణాన్ని కంప్లీట్​చేయాలని ఆదేశించారు. సోమవారం మహబూబ్​ నగర్​ జడ్పీ మీటింగ్​హాల్​లో నిర్వహించిన అధికారుల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో 88 రైతు వేదికలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.13.5 కోట్లు […]

Read More
15వేల మార్క్​దాటిన కరోనా

15వేల మార్క్ ​దాటిన కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి 15వేల మార్క్​ దాటింది. సోమవారం తాజాగా తెలంగాణలో 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 15,394 కేసులు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. తాజాగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 861 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు, మేడ్చల్ జిల్లాలో 20 కేసుల చొప్పున నమోదయ్యాయి.

Read More

సమ్మెకు సిద్ధం కండి

సారథిన్యూస్​, గోదావరిఖని: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై 2,3,4 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు అన్ని సంఘాలు సన్నద్ధం కావాలని సింగరేణి జేఏసీ యూనియన్​ డిమాండ్​ చేసింది. ఈ సమ్మె ద్వారా ప్రధాని మోదీకి కనువిప్పు కలిగించాలని కోరారు. సోమవారం గోదావరిఖనిలో జేఏసీ నాయకులు సమ్మెపోస్టర్​ను విడుదల చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేల్పుల కుమార్ స్వామి, నరేశ్​, ఎంఏ గౌస్, శ్రీనివాస్, తోకల రమేశ్​, ఉపేందర్ ఎండీ గని తదితరులు పాల్గొన్నారు.

Read More

చెరువులు కబ్జా చేస్తే కేసులు

సారథిన్యూస్​, బిజినేపల్లి: చెరువులు, కుంటలను కబ్జా చేస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి తహసీల్దార్​ అంజిరెడ్డి హెచ్చరించారు. రెండ్రోజుల నుంచి బిజినేపల్లి సమీపంలోని సాఖ చెరువులో కొందరు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులందాయి. దీంతో ఆయన చెరువును పరిశీలించారు. అక్రమంగా మట్టిని తవ్వి చెరువులు పూడ్చిన వారి వివరాలను సేకరించారు. ఆయన వెంట నీటిపారుదలశాఖ అధికారులు రమేశ్​, ఆర్​ఐ అలీబాబా నాయుడు తదితరులు ఉన్నారు.

Read More

అభివృద్ధికి చిరునామా తెలంగాణ

సారథిన్యూస్​, రామడుగు: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి చిరునామా అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం MLA సుంకే రవిశంకర్ శంకుస్థపాన చేశారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మైదానంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సర్పంచ్ జీవన్, ఎంపీపీ కవిత నాయకులు జితేందర్ రెడ్డి, కర్ణాకర్, కల్గెటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Read More

సైకాలజిస్ట్​ అసోసియేషన్​ ఎన్నిక

సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా రామడుగు మండలం గోపాల్​రావుపేటకు చెందిన సీనియర్ పాత్రికేయులు ఎజ్రా మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా రేష్మ, ప్రధాన కార్యదర్శిగా ఐలయ్య, సంయుక్త కార్యదర్శిగా అశోక్, సభ్యులుగా సదానందం, కుమార స్వామి తదితరులు ఎన్నికయ్యారు.

Read More

పనులు ప్రారంభించేదెప్పుడు?

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్యపనులను వెంటనే మొదలు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్​ చేశారు. నిధులు విడుదలైనప్పటికీ డంపింగ్​యార్డు, శ్మశానవాటిక పనులు ఇంకా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు వారు సోమవారం రామడుగు డివిజినల్​ పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు పురేళ్ల శ్రీకాంత్​, అనుపురం పరుశరాం, ఉపసర్పంచ్​ రాజేందర్​ తదితరులు ఉన్నారు.

Read More

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: పెట్రోల్​, డిజిల్​ ధరలను వెంటనే డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి డిమాండ్​ చేశారు. సోమవారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​ ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ.. కరోనాతో ఉపాధిలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్​, డిజిల్​ ధరలు పెంచడం సరికాదన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుంటే పెట్రో ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సత్యనారాయణ, మాజీ మార్కెట్ […]

Read More