Breaking News

Day: May 19, 2020

ఉపాధి కూలీలకు పండ్లు పంపిణీ

ఉపాధి కూలీలకు పండ్లు పంపిణీ

సారథి న్యూస్, నర్సాపూర్: ఎల్లంకి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్, లయన్స్​ క్లబ్ నర్సాపూర్ స్నేహబంధ్ సెక్రటరీ అశోక్ కుమార్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం నర్సాపూర్ లో ఉపాధి హామీ కూలీలకు అరటిపండ్లు పంపిణీ చేశారు. వేసవిలో పనులు చేసుకుంటున్న వారికి తమవంతు సాయంగా వాటిని పంపిణీ చేశానని చెప్పారు.

Read More
కారు ఢీకొని ఒకరి మృతి

కారు ఢీకొని ఒకరి మృతి

సారథి న్యూస్​, రామడుగు: కరీంనగర్​ జిల్లా మండలం వెదిర సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నందేల్లి ప్రభాకర్ రావు(46) భార్యతో కలిసి బైక్ ​పై కొండగట్టు నుంచి కరీంనగర్ వైపునకు వెళ్తుండగా, కరీంనగర్ నుంచి ఎదురుగా జగిత్యాల వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రభాకర్​రావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతని భార్య తీవ్రంగా గాయపడింది. మృతుడి […]

Read More
పోలీసుల సేవలు మరవలేనివి

పోలీసుల సేవలు మరవలేనివి

సారథి న్యూస్​, గోదావరిఖని: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పోలీసులు ఎంతో శ్రమించారని కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని సన్ రైస్, స్టార్ హాస్పిటల్స్​ డైరెక్టర్లు డాక్టర్​ సురేష్​, డాక్టర్​ శ్రీనివాస్​ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ సిబ్బందికి మంగళవారం వారు మాస్క్​లు, శానిటైజర్స్ అందజేశారు. కార్యక్రమంలో సీపీ వి.సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ ఉదయ్​కుమార్​, ఏసీపీ నరేందర్​,మంచిర్యాల పట్టణ సీఐ ముత్తి లింగయ్య, సైబర్ క్రైమ్ ఇన్​ స్పెక్టర్​ బుద్దె స్వామి, మంచిర్యాల పట్టణ ఎస్సై ప్రవీణ్ పాల్గొన్నారు.

Read More

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

సారథి న్యూస్​, రామాయంపేట: రెండు వేర్వేరు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతూ నిజాంపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం మృతిచెందారు. మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన రంగ పోచయ్య(63) రెండు రోజుల క్రితం మామిడి పండ్లు తెంచే క్రమంలో చెట్టు పైనుంచి కాలుజారి కింద పడి.. చికిత్స పొందుతూ చనిపోయాడు. చల్మేడ గ్రామానికి చెందిన రాగుల పర్శరాములు(36) గత బుధవారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్సపొందుతూ పరిస్థితి […]

Read More

కరోనా.. భయం వద్దు

సారథి న్యూస్​, ఖమ్మం: జిల్లాలోని మధిర మండలం మహాదేవపురం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో జడ్పీ చైర్మన్​ లింగాల కమల్ రాజు మంగళవారం గ్రామాన్ని సందర్శించి స్థానికులకు మాస్క్​లు, శానిటైజర్లు పంపిణీచేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీకి అక్కడి లోకల్​ కాంటాక్ట్ ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని చెప్పారు. బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్​ చేయిస్తున్నామని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ మెండేం లలిత, టీఆర్ఎస్ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, సీఐ […]

Read More
సీఎం ఒంటెద్దు పోకడలు సరికాదు

సీఎం ఒంటెద్దు పోకడలు సరికాదు

ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ సారథి న్యూస్​, పెద్దపల్లి: గోదావరి నీటి విషయంలో కరీంనగర్, పెద్దపెల్లి జిల్లాలకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని ఆర్టీసీ మాజీ చైర్మన్, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హెచ్చరించారు. రెండు జిల్లాలకు మూడు పంటలకు నీళ్లు ఇచ్చిన తర్వాతే మిగతా నీటిని బయటకు తీసుకెళ్లాలని సూచించారు. మంగళవారం రామగుండంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి జలాల గురించి సీఎం కేసీఆర్​ అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం నీటిని కరీంనగర్​, పెద్దపల్లి […]

Read More
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో పది మంది లబ్ధిదారులకు రూ.10,01,160 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, జడ్పీటీసీ మారుకొండ లక్ష్మి, స్థానిక సర్పంచ్ పంజాల ప్రమీల, సింగిల్​ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్​రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, పలు గ్రామా సర్పంచ్​లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

Read More
సరుకులు పంపిణీ

సరుకులు పంపిణీ

సారథిన్యూస్​, గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి మండలం ధర్మారం చౌరస్తాలో వందమంది ఆటో డ్రైవర్లకు రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్​ డాక్టర్ అద్దంకి శరత్, మడిపెల్లి మల్లేష్, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో మంగళవారం బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుందన పల్లి మాజీ సర్పంచ్ మైసయ్య, ఇంజం సాంబశివరావు, గాజుల రమేష్, తిరుమలచారి, వెంకటేశ్​, పాషా, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.

Read More