Breaking News

సీఎం కేసీఆర్

ముమ్మరంగా టీఆర్ఎస్​సభ్యత్వ నమోదు

ముమ్మరంగా టీఆర్ఎస్​ సభ్యత్వ నమోదు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు యేమ దుర్గపతి ఆధ్వర్యంలో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ ​ప్రభుత్వం అభివృద్ధి పనులను చూసి ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు చేయించుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు ఎల్లబోయిన బాబు, నల్ల యాదగిరి, నల్ల కృష్ణ, ముండ్రాతి ఆంజనేయులు పాల్గొన్నారు.

Read More
కరోనాపై అలర్ట్​గా ఉండండి

కరోనాపై అలర్ట్​గా ఉండండి

హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖను సీఎం కె.చంద్రశేఖర్​రావు అలర్ట్​ చేశారు. ఈ మేరకు వైద్యశాఖమంత్రి ఈటల రాజేందర్, ఇతర అధికారుల‌తో సమీక్షించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. కేసులు పెరగకుండా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మరిన్ని కరోనా పరీక్షలు చేయాలని, అలాగే హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేయాలని కోరారు. ప్రస్తుతానికి తెలంగాణలో కేసులు భారీగా పెరిగిన దాఖలాలు […]

Read More
ఇగ 6,7,8 క్లాసెస్​షురూ

ఇగ 6,7,8 క్లాసెస్ ​షురూ

సారథి న్యూస్​, హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం నుంచి 6, 7, 8వ తరగతి విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. అయితే తరగతులను మార్చి 1వ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని సూచించారు. స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని మంత్రి స్పష్టంచేశారు.

Read More
మోసం చేయడం ఆయన నైజం: భట్టి

మోసం చేయడం ఆయన నైజం : భట్టి

సారథి న్యూస్, తుంగపాడు(మిర్యాలగూడ): నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే ఐకేపీ సెంటర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడం ద్వారా ఇటు మహిళలు, అటు రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను సీఎం కేసీఆర్ ​మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పడం ఆ తర్వాత మోసం చేయడం ఆయన నైజమని ధ్వజమెత్తారు. రైతులతో ముఖముఖి కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం నల్లగొండ […]

Read More
సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని డిండిలో ముంచాలే

సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని డిండిలో ముంచాలే

రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం కార్పొరేట్​ శక్తులకు చేతుల్లోకి వ్యవసాయం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సారథి న్యూస్​, దేవరకొండ: దళిత, గిరిజనులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని డిండి ప్రాజెక్టులో ఎత్తేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రాంతానికి డిండి ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొస్తానని చెప్పిన సీఎం కేసీఆర్​ ఐదేళ్లలో ఒక్క ఎకరాకైనా పారించారా? అని అని ప్రశ్నించారు. రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం […]

Read More
జోగుళాంబ సన్నిధిలో సీఎం కుటుంబసభ్యులు

జోగుళాంబ సన్నిధిలో సీఎం కుటుంబసభ్యులు

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల(మానవపాడు): అష్టాదశశక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ జోగుళాంబ అమ్మవారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్​ సతీమణి కల్వకుంట్ల శోభ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ ​సతీమణి శైలిమ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. సహస్ర కలశాభిషేకంలో పాల్గొని అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం […]

Read More
‘ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేయడమే’

‘ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేయడమే’

సారథి న్యూస్, రామాయంపేట: ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి గెలిపించిన సీఎం కుర్చీని ఎడమకాలు చెప్పుతో సమానమని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని, రాజ్యాంగ వ్యవస్థను అవమానించినట్లేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ఫామ్ హౌస్ ను వదలని.. ప్రగతి భవన్ ను దాటని ముఖ్యమంత్రి రాజీనామా చేసి చేతనైనవారికి పాలన వ్యవస్థను అప్పగించాలని హితవుపలికారు. సోమవారం ఆయన నిజాంపేట మండల కేంద్రంలో బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆ […]

Read More
నిరుద్యోగభృతి హర్షణీయం

నిరుద్యోగభృతి హర్షణీయం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: టీఆర్ఎస్​ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ యువ నాయకులు అత్వెల్లి నాగరాజు అన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన తమ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. నిరుద్యోగుల కోసం భృతి ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. ప్రతిపక్షాలు చేసే అర్థరహితమైన విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. ఉద్యమ సమయంలో కనిపించని నాయకులు ఉద్యమకారులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

Read More