ములుగులో సీతక్క నిరసన సామాజిక సారథి, ములుగు: స్థానికత కోసమే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్చేస్తూ గురువారం ఆమె ములుగు జిల్లా కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలలో ప్రాధాన్యత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని […]
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సామాజిక సారథి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన నిర్భయ కేసు కన్నా దారుణమని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మీ చుట్టాల్లో ఎవరైనా చనిపోతే పోతావు.. ఎంతోమంది రైతులు చనిపోతున్నారు.. కనీసం పాల్వంచ కైనా పోవాలి కదా అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యపై ఇంత వరకూ మాట్లాడక పోవడం విచారకరం […]
రాష్ట్రాభివృద్ధికి పది సూత్రాలు అవినీతికి అంతం పలుకుతాం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఛండీగఢ్: ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను అరవింద్ కేజ్రివాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరోవైపు అధికారం తమ వద్దే ఉంచుకునేందుకు కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్కేజ్రీవాల్పది సూత్రాలతో ‘పంజాబ్మోడల్’ పేరుతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజల ముందుకొచ్చారు. ఆమ్ ఆద్మీ […]
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సామాజికసారథి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్లో చేసిన డ్రామా పీఎం పదవిని దిగజార్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ సభకు జనాలు రాకే కారణం వెతుక్కున్నారని విమర్శించారు. పంజాబ్ సీఎంను నవ్వులపాలు చేయాలని చూశారని, గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై రాయితో దాడి చేసినా నిందలు వేయలేదని గుర్తుచేశారు. పంజాబ్ ప్రభుత్వం మీద కక్షసాధిస్తున్నారని, పంజాబ్ సీఎం ఫెయిల్ అయినట్లు చూపే […]
బీజేపీ మేం పోటీపడలేమన్న అఖిలేష్ లక్నో: రాజకీయ పార్టీలకు వర్చువల్ ప్రచారానికి అనుతినిచ్చినట్లయితే.. అన్ని రాజకీయ పార్టీల పట్ల ఈసీ ఒకేలా అవకాశాలు కల్పించాలని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఒక వేళ డిజిటల్ ప్రచారానికి అవకాశం కల్పిస్తే బీజేపీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలు ఇతర పార్టీల వద్ద లేవన్నారు. రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఓ విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయ పార్టీలకు […]
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సామాజికసారథి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషిచేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సహా వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల పక్రియపైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ […]
ఉత్తమాటలు కట్టిపెట్టాలి: వీహెచ్ సామాజిసారథి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న అవినీతి దేశంలో ఎక్కడా లేదని బీజేపీ నాయకుడు జేపీ నడ్డా చెబుతున్నారని, దమ్ముంటే విచారణ చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు విరుచుకుపడ్డారు. ఆయన ఢిల్లీనుంచి తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇదే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ను జైల్లో పెడతానని చెప్పిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్నే జైల్లో పెట్టారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ను జైల్లో పెడతానని బీజేపీ చెప్పడమేనా, […]
బీజేపీతో దేశానికి ఒరిగిందేమీ లేదు సీఎం కేసీఆర్పై నడ్డా వ్యాఖ్యలు అమానుషం ప్రధాని మోడీ రైతుల ఉసురు పోసుకుంటున్నారు అందుకే పంజాబ్లో రైతన్నల అవమానం మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ.. అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అని మంత్రి కె.తారక రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ రైతు విరోధిగా మారానని దుయ్యబట్టారు. దేశంలో ఏడున్నరేళ్లుగా ప్రజాకంటక పాలన అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులను దారుణంగా హింసించి, పెట్రోగ్యాస్ ధరలు […]