ఎన్డీఏలో చేరాలని ఏపీ జగన్ను ప్రధాని మోదీ ఆహ్వానించారా? ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలో భాగస్వాములుగా మారి వైఎస్సార్సీపీ కి చెందిన ఇందరు ఎంపీలకు మంత్రి పదవులు తీసుకోవాలని మోదీ ఒత్తిడి తెస్తున్నారా? అంటే ఢిల్లీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాక జాతీయ మీడియాలో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తున్న వైఎస్సార్సీపీ త్వరలోనే ఎన్డీఏలో చేరబోతున్నదంటూ వార్తలు వస్తున్నాయి. రెండు వారాల క్రితమే సీఎం […]
సారథి న్యూస్ రామడుగు: హత్రాస్లో దళిత యువతిపై లైంగికదాడి చేసి ఆమె మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాడే శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన రామడుగులో విలేకరులతో మాట్లాడారు. యూపీలో జరిగిన ఘటన నిరంకుశ పాలనకు నిదర్శనమని శంకర్ మండిపడ్డారు. కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కిషన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సయిండ్ల నర్సింగం, మండల పార్టీ ప్రెసిడెంట్ బొమ్మరవేని […]
సారథి న్యూస్, ములుగు: గోదావరి నదిపై కరకట్ట నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతిపత్రం ఇచ్చారు. సోమవారం ఆమె హైదరాబాద్లో రజత్కుమార్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గంలోని మూడు మండలాల గుండా దాదాపు 100 కి.మీ.మేర గోదావరి ప్రవహిస్తుందని చెప్పారు. ఏటా వచ్చే వరదల వల్ల వందలాది ఎకరాల పంట పొలాలు కోతకు గురవుతున్నాయని చెప్పారు. […]
సారథి న్యూస్, వాజేడు: ఖమ్మం జిల్లా వెంకటాపురం సబ్ ఆఫీస్ పరిధిలోని గుమ్మడి దొడ్డి బ్రాంచ్ ఆఫీస్ లో పనిచేస్తున్న పాయం ప్రసాద్ ఇటీవల మృతిచెందాడు. సోమవారం వెంకటాపురంలో అతడి భార్య పాయం శకుంతలకు పోస్టల్ సిబ్బంది లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ డబ్బులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజనల్ సూపరింటెండెంట్, భద్రాచలం నార్త్ అసిస్టెంట్ సూపర్ డెంట్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, గద్వాల: ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్లో సోమవారం చోటుచేసుకుంది. మల్దకల్ గ్రామానికి చెందిన నాగరాజు భార్య జాహ్నవికి నాలుగేండ్ల క్రితం మొదటి కాన్పులో మగపిల్లవాడు జన్మించాడు. రెండవ కాన్పు కోసం శనివారం కర్నూల్లోని బాలాజీ యశోద నర్సింగ్ హోంలో చేరగా.. ఆమెకు ఈ కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు జన్మించారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.
సారథిన్యూస్, మానోపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలో ఇండ్లు, ఆస్తుల నమోదు కార్యక్రమం కొనసాగుతున్నది. ఆదివారం జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి ముషాహీదా బేగం మానోపాడులో పర్యటించి నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇండ్లు, ఆస్తుల నమోదుకు ప్రతి ఒక్కరు సహకరించాలని, తమ ఆస్తులు ఆన్లైన్లో వచ్చేలా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. మండలంలో నారాయణపురం, పెద్ద ఆముదాలపాడ్, చిన్న పోతుల పాడ్, పెద్ద పోతుల పాడ్, చంద్రశేఖర్ నగర్ గ్రామాల్లో జజరుగుతున్న ఇండ్ల నమోదును ఆమె […]
సారథిన్యూస్, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆదివారం జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ను సన్మానించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆమె మంత్రులను కోరారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
న్యూఢిల్లి: ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అవిషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ పలు సంస్థలు వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే అసలు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది..? వస్తే ముందుగా ఎవరికి ఇవ్వాలనేదానిపై ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత్ లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో.. వ్యాక్సిన్ వస్తే ఎవరికి అందజేయాలని దాని మీద కూడా జోరుగా చర్చ జరుగుతున్నది. ఇదే విషయంపై కేంద్ర వైద్య […]