సారథి, రామడుగు: ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న భారతీయ జనతా యువమోర్చా మండల నాయకులను రామడుగు ఎస్సై నరేష్ గురువారం అరెస్ట్చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలుచేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్అయిన వారిలో యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండలాధ్యక్షుడు దురిశెట్టి రమేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కార్యదర్శి బుర్ర […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 7న(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్రమంత్రులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి స్థాయి వరకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును గురువారం ప్రగతి భవన్ లో నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మర్యాదపూర్వకంగా కలిశారు. కాబోయే సీఎం అని శుభాకాంక్షలు తెలిపారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును బుధవారం హైదరాబాద్ వాటర్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కలిశారు. ఎస్సీ, ఎస్టీ వాటర్ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.1.23 కోట్ల వ్యయంతో ఆరు నూతన అంబులెన్స్ లను అందించారు. వాటిని సోమవారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు చేతులమీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి, […]
సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపల్, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును శుక్రవారం ప్రగతి భవన్ లో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరారేఖ శ్యాంనాయక్ కలిశారు. ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరుచేసి సహకరించాలని కోరగా.. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. వారి వెంట ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బక్కశెట్టి కిషోర్ ఉన్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్: ‘సారూ నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన.. కేసీఆర్ సార్ పిలుపునిచ్చినప్పుడల్లా బంద్లో పాల్లొన్న.. ఉద్యమాలు చేసిన.. లాఠీదెబ్బలు తిన్న.. పోలీస్స్టేషన్కు పోయివచ్చిన.. కేసులు గూడ అయినయి.. చివరకు తెలంగాణ వచ్చింది. మా దేవుడు కేసీఆర్ సీఎం అయ్యిండి.. కానీ నన్ను ఎవరూ పట్టించుకోలే’ అంటూ ఓ వ్యక్తి శుక్రవారం ప్రగతిభవన్ ఎదుట ఆందోళనకు దిగాడు. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని రక్షించారు. అనంతరం అతడు మీడియాతో మాట్లాడుతూ.. […]
సారథి న్యూస్టీం: 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సెల్యూట్చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అసెంబ్లీ అవరణలో నిర్వహించిన వేడుకల్లో స్పీకర్పోచారం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన సంబరాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సూర్యాపేట కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో మంత్రి జి.జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో […]