![ప్రగతిభవన్ ముట్టడి.. బీజేవైఎం నేతల అరెస్ట్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/07/rmg-1.jpg?fit=655%2C267&ssl=1)
సారథి, రామడుగు: ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న భారతీయ జనతా యువమోర్చా మండల నాయకులను రామడుగు ఎస్సై నరేష్ గురువారం అరెస్ట్చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలుచేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్అయిన వారిలో యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండలాధ్యక్షుడు దురిశెట్టి రమేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కార్యదర్శి బుర్ర సాగర్, జిల్లా కార్యవర్గ సభ్యులు రామ్, బీజేపీ అధికార ప్రతినిధి పోచంపల్లి నరేష్, కళ్లెం శివ, మాడిశెట్టి సాయి, ఏబీవీపీ నాయకుడు మాదం శివ, బీజేవైఎం అధికార ప్రతినిధి వంచ మనోజ్ తదితరులు ఉన్నారు. అనంతరం వారిని సొంతపూచీకత్తుపై విడిచిపెట్టారు.