Breaking News

POLICE

తప్పడు ప్రచారం చేస్తే కఠినచర్యలు

సారథి న్యూస్, రామడుగు: కరోనాపై సామాజిక మాధ్యమాల్లో తప్పడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని కరీంనగర్​ జిల్లా రామడుగు ఎస్సై అనూష హెచ్చరించారు. కరోనా వచ్చిందని రోగుల వివరాలు బయటపెడితే చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే గ్రూప్​ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐపీసీ, డిజాస్టర్ మేనేజ్​మెంట్​ ఆక్ట్, ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా కట్టడిలో మండల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Read More
బెంగళూరులో అల్లర్లు

ఫేస్​బుక్​ పోస్టు.. బెంగళూరులో విధ్వంసం

బెంగళూరు: ఒక్క ఫేస్​బుక్​ పోస్టుతో బెంగళూరు నగరం అట్టుడికింది. తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యే పులికేశినగర్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సమీపబంధువు ఫేస్​బుక్​లో ఓ కులానికి చెందిన వారిని కించపరుస్తూ ఓ పోస్ట్​పెట్టాడు. దీంతో ఆ కులానికి చెందినవారంతా భారీగా ఎమ్మెల్యే ఇంటివద్దరకు చేరుకొని ఆందోళనకు దిగారు. బెంగళూరులోని పులకేశి నగర్, భారతి నగర్, కమర్షియల్ స్ట్రీట్, టన్నెరీ రోడ్‌లో బలవంతంగా దుకాణాలను […]

Read More
అలంపూర్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు

అలంపూర్​లో సీసీ కెమెరాల ఏర్పాటు

సారథి న్యూస్​, అలంపూర్​: నేరాలను అరికట్టేందుకు పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్​ రతన్​ కుమార్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘నేనుసైతం’ కార్యక్రమంలో భాగంగా అలంపూర్​ చౌరస్తాలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు నారాయణ గౌడ్ ఆర్థికసాయం చేశారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి, సీఐ వెంకట్రామయ్య, ఎస్సై మధుసూదన రెడ్డి, ఏఎస్సై అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.

Read More
గణేశ్​ మండపాలకు అనుమతి లేదు

గణేశ్​ మండపాలకు నో పర్మిషన్​

సారథి న్యూస్​, నల్లగొండ: ప్రస్తుత పరిస్థితుల్లో గణేశ్​ మండపాలు, నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేమని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్​ స్పష్టం చేశారు. కరోనా విపత్తువేళ హిందూ సోదరులంతా పోలీస్​శాఖకు సహకరించాలని ఆయన కోరారు. గణేశ్​ మండపాల నిర్వాహకులకు త్వరలోనే కౌన్సెలింగ్​​ నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా ఇండ్లల్లోనే పూజలు చేసుకోవాలని కోరారు. తయారీదారులు విగ్రహాలను తయారు చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దని.. కరోనా పోయేంత వరకు ఇతర ఉపాధి మార్గాలను వెతుక్కోవాలని సూచించారు.

Read More
రియా చుట్టూబిగిస్తున్న ఉచ్చు

రియాకు ఉచ్చు బిగుస్తోంది

ముంబై: సుశాంత్​సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్​ మాజీ ప్రేయసి రియాచక్రవర్తికి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ కేసులో రియా తీరుపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. మరోవైపు రియా చక్రవర్తి కనిపించకుండాపోవడం అనుమానాలకు తావిచ్చింది. రియాను కాపాడేందుకు ముంబై పోలీసులు రియాను కాపాడేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ కేసు విషయంలో ముంబై పోలీసులకు. బీహార్​ పోలీసులకు వాదోపవాదాలు సాగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనల నేపథ్యంలో రియా శుక్రవారం ఈడీ […]

Read More
75 ఏళ్ల బామ్మపై రేప్​

75 ఏళ్ల బామ్మపై లైంగికదాడి

ఎర్నాకుళం: మహిళలపై దాడులు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 75 ఏళ్ల బామ్మపై ఇద్దరు దుర్మార్గులు లైంగికదాడికి పాల్పడ్డారు. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో ఈ దారుణం చోటుచేసుకున్నది. ప్రస్తుతం బాధితురాలు దవాఖానలో చికిత్సపొందుతున్నది. ఎర్నాకుళంలో ఉంటున్న ఓ వృద్ధురాలికి మతిస్థిమితం లేదు. దీంతో ఆమెను ఇద్దరు దుర్మార్గులు బలవంతంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. మద్యం మత్తులో లైంగికదాడికి పాల్పడటమేకాక ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. మరో 66 ఏండ్ల వృద్ధురాలు నిందితులకు సహకరించినట్టు సమాచారం. ఈ కేసులో పోలీసులు […]

Read More
పోలీసులపై అమృత ఫైర్​

ముంబై పోలీసులపై అమృత ఫైర్​

ముంబై: ముంబై పోలీసులపై మహారాష్ట్ర మాజీసీఎం ఫడ్నవీస్​ సతీమణి అమృత ఫడ్నవీస్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముంబై నగరం మానవత్వాన్ని కోల్పోయింది. ఇక్కడి పోలీసుల తీరు బాధ్యతారాహిత్యాన్ని తలపిస్తుంది. వీరంతా నిజానిజాలను పక్కనపెట్టి అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాస్తున్నారు. పోలీసుల వ్యవహారశైలితో ముంబైలో బతకడం అంత సురక్షితం కాదేమో అనిపిస్తుంది’ అంటూ ఆమె ట్వీట్​ చేశారు. సుశాంత్​ కేసులో మహారాష్ట్ర, బీహార్​ పోలీసుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో అమృత వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. […]

Read More
చేవెళ్లలో గుట్కా సీజ్​

భారీగా గుట్కా ప్యాకెట్లు సీజ్​

సారథిన్యూస్​, చేవెళ్ల: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను టాస్క్​ఫోర్స్​ పోలీసులు సీజ్​ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్​స్టేషన్​ పరిధిలోని బీబీగూడెం వద్ద టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేపట్టగా సుమారు రూ. 2 లక్షల 45 వేల విలువైన గుట్కాప్యాకెట్లు పట్టుబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు గుట్కా ప్యాకెట్లను హైదరాబాద్​ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీబీగూడెనికి తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్​ చేసినట్టు […]

Read More