సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, టీజేఏసీ చైర్మన్ కోదండరాం త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయనున్నాడు. అందుకోసం ఆయన విపక్షాల మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి పోటీచేసినప్పటికీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో తెలంగాణ యువత, నిరుద్యోగుల్లో కోదండరాం పట్ల సానుభూతి ఉన్నది. సోషల్మీడియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఈ క్రమంలో గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగితే కోదండరాం తేలిగ్గా గెలుస్తారని […]
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో గత రెండ్రోజులగా కురుస్తున్న వర్షాలతో రోడ్ల మీద నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మునగాల ఎస్సై సత్యనారాయణగౌడ్ సూచించారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మునగాల మండలంలోని తాడువాయి నుంచి తాడువాయి తండా మధ్యలో ఉన్న అలుగు ఉధృతంగా ప్రవహిస్తున్నదన్నారు. ఈ మార్గాల గుండా వెళ్లే ప్రజలు ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలని ఆయన కోరారు. అదే విధంగా మునగాల నుంచి గణపవరం, తిమ్మారెడ్డిగూడెం, కొక్కిరేణి, వెల్దండ, చీదేళ్ల, తంగెళ్ల గూడెం, […]
చింతపల్లి: హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురితండా వద్ద కారు వేగం అదుపుతప్పి బోల్తాపడింది. రోడ్డు పక్కన వాటర్లైన్పిల్లర్ను ఢీకొని కారు ఐదారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి మల్లేపల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణం కారణమని తెలుస్తోంది. కారులో ఇరుక్కపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టం మీద […]
సారథి న్యూస్, హైదరాబాద్: నల్లగొండలోని నవ్య హాస్పటల్ ను సీజ్ చేయడం, డాక్టర్ చెరుకు సుహాస్ ను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని తెలంగాణ ప్రజల పార్టీ తీవ్రంగా ఖండించింది. వారి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్తా, వర్కింగ్ ప్రసిడెంట్ శ్యాంసుందర్, వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్, జనరల్ సెక్రటరీ ఇంద్రసేనా, జాయింట్ సెక్రటరీ కోట్ల వాసుదేవ్ ప్రభుత్వానికి సూచించారు. అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో […]
గత ఐదేండ్లుగా తనపై 139 మంది లైంగికదాడి చేశారంటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత యువతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె పలువురు ప్రముఖుల పేర్లను వెల్లడించింది. అందులో యాంకర్ ప్రదీప్, కృష్ణుడు తదితరులు ఉన్నారు. కాగా, ఈ ఆరోపణలపై ఇప్పటికే ప్రదీప్ స్పందించారు. తాజాగా, మరో నటుడు కృష్ణుడు కూడా ఈ వివాదంపై మాట్లాడారు. నాకు ఏపాపం తెలియదని చెప్పారు. కొందరు తనను కుట్రపూరితంగా ఈ వివాదంలోకి లాగుతున్నారన్నారు. ‘నాపై ఆరోపణలు రావడంతో షాక్కు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఓ దళిత యువతపై ఏండ్ల తరబడి 143 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. దేశంలోని పలుప్రాంతాలకు ఆమెను తిప్పి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారం జరిపిన వాళ్లలో విద్యార్థినాయకులు, రాజకీయనాయకుల పీఏలు, పలువురు టీవీ, సినీ రంగానికి చెందినవారు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ కేసును హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్క హైదరాబాద్ నగరమే కాదు.. యావత్ తెలంగాణ సమాజమే ఉలిక్కిపడింది. ప్రస్తుతం 143 మందిపై కేసు నమోదైనట్టు […]
సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేటీఅన్నారం వద్ద మూసీ నదిలో కొట్టుకుపోయిన ముగ్గురు యువకులను పోలీసులు.. స్థానికుల సహకారంతో కాపాడారు. కొన్ని రోజులుగా భారీవర్షాలు కురుస్తుండడంతో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఖాసీంపేటకు చెందిన షబ్బీర్, సోహాల్, కైఫ్ అక్కడికి.. మూసీనదిని చూసేందుకు అక్కడికి వచ్చారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కాలుజారి పడిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు, ఫైర్సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో నదిలో చిక్కుకున్న యువకులను కాపాడారు.
సారథి న్యూస్, నల్లగొండ: ప్రస్తుత పరిస్థితుల్లో గణేశ్ మండపాలు, నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేమని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. కరోనా విపత్తువేళ హిందూ సోదరులంతా పోలీస్శాఖకు సహకరించాలని ఆయన కోరారు. గణేశ్ మండపాల నిర్వాహకులకు త్వరలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా ఇండ్లల్లోనే పూజలు చేసుకోవాలని కోరారు. తయారీదారులు విగ్రహాలను తయారు చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దని.. కరోనా పోయేంత వరకు ఇతర ఉపాధి మార్గాలను వెతుక్కోవాలని సూచించారు.