సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కార్యాలయంలో కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈటలకు చెందిన 7 గురు వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. మంత్రికి చెందిన ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్మెన్లకు ప్రస్తుతం కరోనా సోకింది. వారంతా హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు […]
సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుతం వాతవరణ పరిస్థితుల్లో వరిపంటకు దోమపోటు, ఆకు ఎండుతెగులును గమనించామని మెదక్ జిల్లా నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్ పేర్కొన్నారు. వీటిని నివారిస్తే వరిలో అధికదిగుబడి సాధించవచ్చని చెప్పారు. బాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణకు ప్లాంటో మైసిన్ 100 గ్రామ్, లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ , 600 గ్రాములు లీటరు నీటికి కలిపి ఒక ఎకరంలో పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఇక అగ్గితెగులు నివారణకు ట్రైసాక్లోజల్ 120 గ్రామ్ లేదా ఐసోప్రాథయోలిన్ […]
సారథి న్యూస్, రామడుగు: మాములు సమయాల్లో ఎలాగో కష్టపడుతూ ఆ గుంతలు, మిట్టలో కాస్త ఇబ్బందికరంగానైనా మనం రోడ్డు ప్రయాణాలు చేస్తుంటాం.. కానీ వానొచ్చనప్పడు వాటి పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. రోడ్డు నిండా నిలిచిన నీళ్లు.. ఎక్కడ ఏ గొయ్యి ఉందో తెలియదు. కళ్లు మూసుకొని దేవుడిమీదే భారం వేసి వెళ్లాల్సి వస్తుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు రోడ్లు గతుకులు పడ్డాయి.. శ్రీరాముల పల్లి రోడ్డును ఆనుకొని, మోడల్ […]
సారథి న్యూస్, దేవరకద్ర: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అందుకోసం సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తంచేశారని వెల్లడించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డితో కలసి శనివారం 7.7లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కోయిల్ సాగర్ తో పాటు కోయిలకొండ, రామగిరిగుట్ట, రాంకొండ ప్రాంతాలు పర్యాటక కేంద్రాల […]
న్యూఢిల్లీ: కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి వ్యక్తిగత వెబ్సైట్ హ్యాక్కు గురైంది. తన వెబ్సైట్లో పాకిస్థాన్కు అనుకూలంగా పోస్టులు ఉండటంతో ఆయన ఈ విషయాన్ని గుర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కిషన్రెడ్డి వెబ్సైట్ను హ్యాక్చేసిన దుండగులు ‘అందులో కశ్మీర్ ఆజాదీ’ అంటూ పోస్టులు పెట్టారు. దీంతో పాటు మనదేశానికి సంబంధించిన వ్యతిరేక పోస్టులు పెట్టారు. కాగా ఈ విషయంపై కిషన్రెడ్డి సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సాంకేతిక బృందం వెబ్సైట్ను పునరుద్ధరిస్తోంది. కిషన్రెడ్డి వెబ్సైట్ను ఉగ్రవాదులు హ్యాక్ […]
సారథిన్యూస్, హైదరాబాద్: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్రావు ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ఎస్పీ బాలు కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని యావత్ దేశం ప్రార్థిస్తోంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా ప్రముఖులు కూడా బాలు ఆరోగ్యం మెరుగుపడాలని […]
సారథిన్యూస్, వరంగల్: వరదబాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రులు కేటీఆర్, ఈటల, ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. మంగళవారం వారు వరంగల్ నగరంలో పర్యటించారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ హైదరాబాద్ నుంచి వరంగల్కు హెలీక్యాప్టర్లో వెళ్లారు. అనంతరం ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్తో కలిసి వరంగల్ నగరంలోని నయీం నగర్, సమ్మయ్య నగర్, గోపాలపూర్, పెద్దమ్మగడ్డ – యూనివర్సిటీ రోడ్, పోతన నగర్, బొందివాగు రోడ్, రామన్నపేట, హంటర్ రోడ్, సంతోషిమాత గుడి ప్రాంతం, […]
సారథి న్యూస్, ఖమ్మం: నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హామీ ఇచ్చారు. మున్నేరు కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో నిర్వాసితులైన ప్రజలకు ఖమ్మం నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపు ఏర్పాటుచేశారు. ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్ నిర్వాసితులను కలిసుకొని వారితో మాట్లాడారు. నిర్వాసితులతో ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మున్నేరు ఉధృతిని పరిశీలించారు. మున్నేరు ప్రవహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేలా నోట్ తయారు చేయాలని మున్సిపల్ కమిషన్ అనురాగ్ […]