Breaking News

KALWAKURTHY

‘సుంకిరెడ్డి’కి హ్యాండిచ్చారు..!

సుంకిరెడ్డికి హ్యాండిచ్చారు..!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదిలోనే నిరాశే ఎదురైంది. దీంతో చేసేదిలేక దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. కాంగ్రెస్​ అధిష్టానం కల్వకుర్తి టికెట్​ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఖరారుచేసింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. గతంలో ఆయన కల్వకుర్తి నుంచి పోటీచేద్దామని భావించినా బీఆర్​ఎస్​ టికెట్​ రాలేదు. 2023 ఎన్నికల్లోనూ మరోసారి నిరాశే ఎదురుకావడంతో కాంగ్రెస్​ గూటికి చేరారు. […]

Read More
కల్వకుర్తిలో కసిరెడ్డి.. కందనూలులో రాజేశ్​ రెడ్డి

కల్వకుర్తిలో కసిరెడ్డి.. కందనూలులో రాజేశ్​రెడ్డి

  • October 15, 2023
  • KALWAKURTHY
  • Comments Off on కల్వకుర్తిలో కసిరెడ్డి.. కందనూలులో రాజేశ్​రెడ్డి

సామాజికసారథి, నాగర్​కర్నూల్​ బ్యూరో: ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు రానే వచ్చింది. 55 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్​ విడుదల చేశారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాకు సంబంధించి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి అందరూ భావించినట్లుగానే ఎమ్మెల్సీ నారాయణరెడ్డికి కాంగ్రెస్​ టికెట్​ వరించింది. నాగర్​కర్నూల్​ నుంచి మరో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి తనయుడు డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​​రెడ్డికి టికెట్ ను​ ఖరారు చేశారు. కొడంగల్​ […]

Read More
సుంకిరెడ్డి’.. దారెటు?

‘సుంకిరెడ్డి’.. దారెటు?

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సరిపోయినంతా డబ్బు ఉంది కదా.. రాజకీయం చేద్దామని ప్రజలకు సేవ పేరుతో, ఎంతో ఉత్సాహంతో కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అంతలోనే సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో కొద్దిరోజులు హల్​ చల్​ చేశారు. కాంగి‘రేసు’లో టికెట్ తనకే పక్కా అని చెప్పుకున్నా.. రానురాను పార్టీలో నేతల చేరికల పరిణామాలు మారుతుండటంతో డీలా పడిపోయారు. కొద్దిరోజులుగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇంతలోనే మరోనేత కాంగ్రెస్ […]

Read More
తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు

సామాజికసారథి, రంగారెడ్డి బ్యూరో/వెల్డండ: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు.. నలుగురికి రుచికరమైన వంటలు చేసిపెట్టడమే వారి వృత్తి. ఓ శుభకార్యంలో వంటలు చేసి ఇళ్లకు బయలుదేరిన నలుగురు యువకులు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్​- శ్రీశైలం హైవేపై మహేశ్వరం మండలం తుమ్మలూర్​ వద్ద ఈ యాక్సిడెంట్​ జరిగింది. నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన ఇమ్మరాజు రామస్వామి(36), బైకాని యాదయ్య (35), హెచ్.​ […]

Read More
నాగర్​కర్నూల్​జిల్లాలో పొలిటికల్​సైలెన్స్

నాగర్​కర్నూల్​ జిల్లాలో పొలిటికల్​ సైలెన్స్​

ప్రభావం చూపలేకపోతున్న ప్రతిపక్ష పార్టీలు అంతా అధికారపార్టీదే హవా సొంత ఎజెండాలతో ముందుకు వెళ్లలేని నాయకులు సామాజికసారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ పొలిటికల్​హీట్​రాజుకుంటోంది. ఏ జిల్లాలో చూసినా రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. ఫలానా పార్టీ నుంచి ఫలానా నాయకుడు పోటీచేస్తున్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. చిన్నాచితక లీడర్లు సైతం అధికారంలోకి వచ్చే పార్టీ వైపు వెళ్లాలని తమ అంచనాల్లో ఉన్నారు. కానీ నాగర్ కర్నూల్ జిల్లా రాజకీయాలు మాత్రం కాస్తా స్తబ్దంగానే ఉన్నాయని […]

Read More
బీఎస్పీ నాయకుడికి పరామర్శ

బీఎస్పీ నాయకుడికి పరామర్శ

సామాజికసారథి, కల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని యంగంపల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ నాయకుడు ఆంజనేయులు ఇటీవల కరెంట్​షాక్​కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జ్​కొమ్ము శ్రీనివాస్​యాదవ్ బుధవారం ​అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆంజనేయులు బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట బీఎస్పీ జిల్లా కోశాధికారి బ్రహ్మం తదితర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More
జడ్పీటీసీ కుమారుడికి ఎంపీ, ఎమ్మెల్యే ఘననివాళి

జడ్పీటీసీ కుమారుడికి ఎంపీ, ఎమ్మెల్యే ఘననివాళి

సారథి, కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం కడ్తాల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ మొదటి కుమారుడు రాధాకృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, జడ్పీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి జడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్మారకార్థం నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమనగల్లు జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్, కేశంపేట, కొత్తూరు, […]

Read More
లంచం సొమ్మును కాల్చేసిన వైస్​ ఎంపీపీ

లంచం సొమ్మును కాల్చేసిన వైస్​ ఎంపీపీ

ఏసీబీకి పట్టుబడిన వెల్దండ తహసీల్దార్​, ఆయన బినామీ తహసీల్దార్​ సైదులు గౌడ్​, వెంకటయ్య గౌడ్​ అవినీతి వెలుగులోకి.. పేదల కడుపుకొట్టి.. పెద్దలకు పంచిన సదరు అధికారపార్టీ నేత సారథి, కల్వకుర్తి/వెల్దండ: ఏసీబీ అధికారులు దాడులు చేయడానికి వచ్చారని తెలుసుకుని నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ తహసీల్దార్​ బినామీ అయిన మాజీ వైస్​ ఎంపీపీ వెంకటయ్య గౌడ్​ రూ.ఐదులక్షల నోట్లను కాల్చివేశాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలో కలకలం సృష్టించింది. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. […]

Read More