సారథి న్యూస్, గద్వాల: నిత్యం దొంగతనాలు చేస్తూ.. పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఓ ముఠా ఎట్టకేలకు చిక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పీఎస్ పరిధిలో గత మూడేండ్లుగా ఓ ముఠా తరుచూ దొంగతనాలకు పాల్పడుతున్నది. ఇప్పటికీ ఈ ముఠా సభ్యులు 11 దొంగతనాలు చేశారు. ఈ నెల 18న రాజోలి వైన్షాప్లో ఈ దొంగలు చోరీ చేసి రూ. 45 వేలు, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. సోమవారం […]
పుట్టాన్దొడ్డి(ఇటిక్యాల): ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్దొడ్డి శివారులో 171, 172 సర్వేనంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. దీనిపై రెవెన్యూ సిబ్బంది బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి ఆక్రమించేందుకు యత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
సారథిన్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ప్రభుత్వా ఆసుపత్రిలో మంగళవారం 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అలంపూర్ పట్టణంలో 14 మందికి, శాంతినగర్లో 1, కాశాపూర్లో 1, పుల్లూర్లో 2, బుక్కపూర్లో 1, పెద్దపోతులపాడులో 1, బైరపూర్లో 1 కేసులు నమోదైనట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు.మనోపాడ్ మండలంలో..36 మందికి టెస్టులు చేయగా 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మొన్నిపాడులో 1, పుల్లూర్ 3, మద్దూర్ […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 44 మందికి కరోనా రాపిడ్ టెస్టులు నిర్వహించగా 14 మందికి కరోనా సోకింది. మానవపాడు -2, కొర్రిపాడు -1, మద్దూరు -2, ఉండవెల్లి మండలంలోని ఉండవెల్లి -1, పుల్లూరు -5, అలంపూర్ క్రాస్ రోడ్డు -2, ఇటిక్యాల మండలంలో – 1 చొప్పున కేసులు నమోదైనట్టు డాక్టర్ దివ్య తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, విధిగా […]
సారథి న్యూస్, మానవపాడు: కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ దివ్య సూచించారు. మానోపాడు పీహెచ్సీ పరిధిలో 75 మందికి పరీక్షలు నిర్వహించగా 21 కేసులు బయటపడ్డాయని చెప్పారు. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జలుబు, దగ్గు , ఆయాసం, జ్వరం ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
సారథి న్యూస్, మానవపాడు: కొంతమంది కరోనాను చాలా తేలికగా తీసుకుంటున్నారని మహమ్మారిపై అలసత్వం ఏ మాత్రం పనికిరాదని జోగుళాంబ గద్వాల జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సునీత పేర్కొన్నారు. కరోనాపై అలసత్వం వహిస్తే అది మన ప్రాణాలనే హరిస్తుందని చెప్పారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సోమవారం మానవపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మానవపాడు మండలంలో సోమవారం ఒక్కరోజే 24 పరీక్షలు చేయగా 12 మందికి కరోనా సోకిందని చెప్పారు. […]
మానోపాడు: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమని జోగుళాంబ గద్వాల డీఎంహెచ్వో చందునాయక్ పేర్కొన్నారు. గురువారం ఆయన మానోపాడు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్సీ ఆవరణలో చెత్త పేరుకుపోయి ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. రోగులకు విధిగా శానిటైజర్ లను అందించడంతోపాటు కరోన మహమ్మారి పట్ల భయం తొలగించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సవిత, సూపరవైజర్లు చంద్రన్న, లలిత […]
20తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు అపహరణ సారథి న్యూస్, జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలో షేరల్లి విధికి చెందిన జాహిరబేగం ఇంట్లో 20తులాల బంగారు ఆభరణాలు, రూ 40వేలు నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరణ చేసినట్లు బాధితులు నసిర్ తెలిపారు. బాధితులు నసిర్ తెలిపిన వివరాలు: సోమవారం మధ్యాహ్నం తమ అక్క జాహిరబేగం ఆమె కూతురు గద్వాల పట్టణంలోని ఆఖర్అలీవిధి లో బంధువుల పెళ్లికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో […]