ఈనెల 31లోగా ఆధార్ అనుసంధానం దళిత బంధు ధరణిపై ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్ శరత్ సామాజిక సారథి సంగారెడ్డి ప్రతినిధి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించినట్లు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలు, పోడు భూములు, ఆధార్ అనుసంధానం, ధరణి తదితర విషయాలపై ప్రత్యేక […]
కరోనా నేపథ్యంలో సర్కారు నిర్ణయం 16న ముగిసిన సంక్రాంతి హాలీ డేస్ మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా విద్యాసంస్థలకు పొడిగింపు మెడికల్కాలేజీలకు మినహాయింపు సెలవులు రద్దుచేయాలని ఉపాధ్యాయ, ప్రైవేట్స్కూళ్ల యాజమాన్యాల డిమాండ్ పిల్లల చదువులపై పేరెంట్స్ఆందోళన సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. మెడికల్కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు 16వ […]
రైతు అంశాలపై ప్రధాని మోడీ నిర్లక్ష్యం మద్దతు ధరలు, పరిహారం విషయంలో స్పందనలేదు పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా ఆగ్రహం న్యూఢిల్లీ: రైతుల అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తప్పుబట్టారు. రైతు సమస్యలు, సామాన్య ప్రజల విషయంలో ఎలాంటి స్పందన లేని రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టపరమైన హామీ, మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్కు కాంగ్రెస్ బాసటగా నిలుస్తుందని […]
ఎంపీటీసీలు రాక జనరల్ బాడీ సమావేశం వాయిదా సామాజిక సారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల సర్వసభ్య సమావేశం గురువారం అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో వాయిదాపడింది. ఈ మేరకు ఎంపీటీసీలకు నిధులు ఏమీ రావడం లేదని, దీంతో హాజరుకావాలని కాలేకపోతున్నామని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ విషయమై పరిధిలోని తిమ్మినోనిపల్లి సర్పంచ్ రామచంద్రారెడ్డి ఎంపీపీ విజయను నిలదీశారు. మండల సర్వసభ్య సమావేశం ఉందని హైదరాబాద్ లో ఓ ముఖ్యమైన పని వదులుకొని […]
రైతులను చంపిన దుర్మార్గమైన ప్రభుత్వం మతఘర్షణలతో పబ్బం గడిపే ఉన్మాదులు ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని చూడలేదు సాగనంపకుంటే శంకరగిరి మాన్యాలే కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఓ దద్దమ్మ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు బంద్ కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్ సామాజిక సారథి, హైదరాబాద్: పాలనారంగంలో అనేక వైఫల్యాలను మూటగట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందేనని సీఎం కేసీఆర్ఉద్ఘాటించారు. ఈ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. దేశంలో ఆహారభద్రత కొరవడిందని, ఆహారసూచీలో ఇతర దేశాలతో వెనకబడిందన్నారు. కేంద్రం తీరువల్ల […]
సామాజిక సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో కేబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.