Breaking News

CARONA

9లక్షలు దాటాయి

ఢిల్లీ: భారత్​లో కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9,06,752 కేసులు నమోదయ్యాయి. గత 20 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రికవరీరేటు ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ కేసులు సంఖ్య పెరుగటం ఆందోళన కలిగిస్తున్నది. గత 24 గంటల్లో 28,000 కొత్తకేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 23,727 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 5,71,459 మందికి కరోనా రోగులకు వ్యాధి నయమైంది. కాగా 3,11,565 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.

Read More
షార్ట్ న్యూస్

బీహార్​లో లాక్​డౌన్​!

పాట్నా: బీహార్​లో మరోసారి లాక్​డౌన్​ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశం కానున్నది. దీనిపై ఆ రాష్ట్ర సీఎస్​ దీపక్ ‌కుమార్ మాట్లాడుతూ.. ‘సీఎం నితీష్ కుమార్‌ అధ్యక్షతన ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల క‌ట్టడి గురించి సమీక్షించ‌నున్నారు. పెరుగతున్న కేసుల దృష్ట్యా రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే ఆలోచన ఉంది’ అని ఆయన తెలిపారు. అయితే […]

Read More
షార్ట్ న్యూస్

పోలీసులు జాగ్రత్తగా ఉండాలి

నల్లగొండ: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పోలీస్​ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ నర్మద సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రీడ్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి డాక్టర్ అనూష ఆధ్వర్యంలో జిల్లాలోని 2000 మంది పోలీస్​సిబ్బందికి రోగనిరోధకశక్తిని పెంచే హోమియో మందలను అందించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సీఐ రమేశ్​, సత్యం, డీపీవో సూపరింటెండెంట్​ దయాకర్, ఆర్​ఐ నర్సింహాచారి, డీటీఆర్సీ సీఐ అంజయ్య, కార్తీక్, శంకర్, నవీన్, […]

Read More

కరోనా నియంత్రణలో విఫలం

సారథిన్యూస్, రామడుగు: కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య ఆరోపించారు. సోమవారం ఆయన తననివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 30 వేల కేసులు నమోదైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయడం లేదని విమర్శించారు. పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, పారామెడికల్​ సిబ్బంది, ఏఎన్​ఎంలు, జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.

Read More
ఏపీలో అన్ని ఎంట్రెన్స్​లు వాయిదా

ఏపీలో అన్ని ఎంట్రెన్స్​లు వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఎంసెట్ స‌హా అన్ని ర‌కాల‌ ఎంట్రెన్స్​లను వాయిదా వేసింది. కరోనా సమయంలో సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి సూచనలతో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్‌, పీజీ సెట్‌ల‌తో క‌లిపి మొత్తం 8 సెట్ల ఎగ్జామ్స్​ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ‌ మంత్రి ఆదిమూల‌పు సురేష్​ సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే పరీక్షల తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. సెప్టెంబ‌ర్ మూడవ వారంలో ఎంసెట్ నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన ప‌రీక్ష తేదీల‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. డిగ్రీ, […]

Read More
తెలంగాణలో 1,550 కేసులు

తెలంగాణలో 1,550 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,550 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 36,221 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 9 మంది చనిపోగా, ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 365కు చేరింది. వైద్యం అనంతరం 23,679 మంది ఇప్పటిదాకా డిశ్చార్జ్​అయ్యారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 926 అత్యధికంగా నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్​53, సంగారెడ్డి 19, ఖమ్మం 38, […]

Read More
ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం

ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం

వైద్యసిబ్బందిలో ఆత్మవిశ్వాసం దెబ్బతీయొద్దు కరోనాకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం మహబూబ్​నగర్ ​మెడికల్ ​కాలేజీ ప్రారంభోత్సవంలో మంత్రి కె.తారకరామారావు సారథి న్యూస్, మహబూబ్​నగర్: కరోనాకు పేద, ధనిక అనే తేడాలు ఉండవని, ఎవరికైనా రావచ్చని మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కరోనాపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వీకరిస్తామని హితవుపలికారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ ​కాలేజీని […]

Read More
నిజామాబాద్​డీఎంహెచ్​వో రాజీనామా

నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా

సారథి న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ​నాగేశ్వర్ రావు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. వైద్యాశాఖ ఉన్నతాధికారులకు తన రాజీనామా లెటర్​ను పంపించారు. అయితే ఇటీవల జిల్లాకేంద్రంలో కరోనాతో మృతిచెందిన ఓ పేషెంట్​ను ఎలాంటి భద్రతాచర్యలు పాటించకుండా ఆటోలో తీసుకెళ్లారు. పీపీఈ కిట్లు మాత్రమే ధరించిన సిబ్బంది మాత్రమే అంబులెన్స్​లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే జిల్లా ఆస్పత్రిలో సకాలంలో సరైన వైద్యం అందక నలుగురు రోగులు మృతిచెందారు. ఈ వరుస ఘటనలపై పై […]

Read More