సారథి న్యూస్, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. గురువారం వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల ఇన్చార్జ్లతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అక్టోబర్1 నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ గ్రామ, మండల నియోజకవర్గాల వారీగా నియమించిన […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె దాకా వాటి ఫలితాలు అందేలా చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దశాబ్దాల కాలంగా వలస పాలనలో అపరిష్కృతంగా ఉన్న నివాసస్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇళ్లు, […]
సారథిన్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని నిబంధనలతో 25 శాతం బస్సులు నడిపిందేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. నిబంధనలు అమలు చేస్తూ అన్ని రూట్లలో బస్సులు నడపనున్నట్టు సమాచారం. ఈ మేరకు గురువారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ అప్పటి నుంచి హైదరాబాద్లో బస్సులు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నుంచి బస్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 డిపోలలో ఉన్న దాదాపు 2800 […]
డ్రగ్స్కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ రేపు ( శుక్రవారం)ఎన్సీబీ ( నార్కోటిక్స్ కంట్రల్ బ్యూరో) మందుకు వెళ్లనున్నది. అయితే రకుల్ విచారణంలో ఎవరెవరరి పేర్లు చెబుతుందోనని టాలీవుడ్లో టెన్షన్ నెలకొన్నది. డ్రగ్స్కేసులో రకుల్ పేరు వచ్చాక పలు నాటకీయపరిణామాలు చోటుచేసుకున్నాయి. రియా చక్రవర్తి చెప్పిన పేర్లలో రకుల్ ప్రీత్సింగ్ పేరు ఉందంటూ ఇటీవల నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో రకుల్ ఒక్కసారిగా మీడియాపై మండిపడింది. అనవసరంగా తన పేరును లాగుతున్నారని హెచ్చిరించింది. అయితే […]
న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి కరోనా సోకి మరణించారు. లక్షణాలేమీ లేకున్నా (అసింప్టమేటిక్) కరోనాతో రెండువారాల క్రితం ఢిల్లీలోని ఏయిమ్స్లో చేరిన ఆయన.. బుధవారం తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయనకు శ్వాసకోస ఇబ్బందులు తలెత్తడంతో ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ వల్ల మరణించిన తొలి కేంద్ర మంత్రి ఆయనే. కర్నాటకకు చెందిన సురేశ్ అంగడి.. బెల్గావి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు […]
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మరో పవర్ఫుల్ వ్యాక్సిన్ రాబోతున్నది. ప్రస్తుతం చివరి అంటే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకున్న ఈ వ్యాక్సిన్ ఈ ఏడాది చివరినాటికే అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఈ వ్యాక్సిన్ను ప్రముఖ సంస్థ జాన్సన్ & జాన్సన్ తయారు చేస్తున్నది. అయితే ఈ వ్యాక్సిన్ కేవలం ఒక్కడోసు వేసుకుంటే సరిపోతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న చాలా వ్యాక్సిన్లు రెండు డోసుల వేసుకోవాల్సి ఉన్నది. అయితే జాన్సన్ […]
తొలుత కొంత చప్పగా సాగిన బిగ్బాస్ హౌస్ ఈ మధ్య ఊపందుకున్నది. బిగ్బాస్ ఇస్తున్న వైవిధ్యభరితమైన టాస్కులతో ప్రేక్షకుల్లోనూ కొంత ఆసక్తి పెరిగింది. అయితే హౌస్ లో వినోదం కాస్త తగ్గడంతో ఇప్పటికే ముక్కు అవినాశ్, కుమార్ సాయి అనే ఇద్దరు కమెడీయన్లను దించారు. అవినాశ్ కాస్త బాగానే వినోదం పండిస్తున్నా.. కుమార్సాయి మాత్రం ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మరో హాట్ హీరోయిన్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టబోతున్నట్టు […]
ఇక ముందు ఇంచు భూమి బదిలీ కావాలన్నా ధరణి పోర్టల్లోనే.. సాదాబైనామాలకు ఇదే చివరి అవకాశం ఫ్రీగా నోటరీ, జీవో 58, 59 స్థలాల రెగ్యులరైజేషన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్రావు సారథి న్యూస్, హైదరాబాద్: దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి సహా ప్రజలందరి ఆస్తులకు […]