జూబ్లీహిల్స్లోని ఇంటివద్ద ఉద్రిక్తత ఉదయం నుంచే మోహరించిన పోలీసులు ఎర్రవెల్లి వెళ్లేందుకు ప్రయత్నించగా అదుపులోకి జగిత్యాలలో జీవన్ రెడ్డి, శ్రీధర్బాబు కూడా అరెస్ట్ సామాజికసారథి, హైదరాబాద్: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రవెల్లికి వెళ్లకుండా జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటివద్దకు ఉదయం నుంచే పోలీసులు చేరుకుని నిర్బంధించారు. దీంతో కాంగ్రెస్కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సోమవారం ఎర్రవల్లిలో […]
కొరవడిన మొయింటనెన్స్ డీజిల్ పోయించుకోలేని పరిస్థితి కొన్ని జిల్లాల్లో నిలిచిపోయిన సేవలు మొదట 45 రకాల మందులు.. ప్రస్తుతం నాలుగైదు గోలీలతోనే సరి సకాలంలో అందని వేతనాలు ఉద్యోగుల సర్దుబాటుకు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా 1,250 మంది సిబ్బంది సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య సేవలందిస్తున్న 104 అంబులెన్స్లు త్వరలోనే నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఉద్యోగులను ఇతర […]
వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకటి కరుణ సామాజిక సారథి, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాకు కేటాయించిన హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకటి కరుణ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్, సీఎం కార్యాలయం ప్రత్యేక అధికారి గంగాధర్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లాలోని మెడికల్ ఆఫీసర్స్ తో కలిసి ఆమె సమీక్ష […]
రాష్ట్రంలో ఇద్దరి మృతి సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో 146 కరోనా కేసులు ఆదివారం నమోదయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. 24 గంటల్లో 26,625 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 146 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 72 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 189 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,78,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,70,435 మంది […]
న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన సీనియర్ న్యాయవాది పి.నిరూప్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ గా నియమితులయ్యారు. డిసెంబర్ 8న ఫుల్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ఎంపికచేసిన మొట్టమొదటి సీనియర్ అడ్వకేట్ నిరూప్ కావడం విశేషం. నిరూప్ తండ్రి మాజీమంత్రి పి.రామచంద్రారెడ్డి కూడా స్వయాన న్యాయవాది. ఆయన మూడు దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో సేవలు అందిస్తున్నారు. 31 జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసుల్లో తీర్పులు నివేదించారు. ముఖ్యంగా ప్రైవేట్ ఇంటర్నేషనల్లా, ఎన్విరాన్ మెంటల్ లా, […]
కేంద్రం తీరుకు నిరసనగానే బాయ్కాట్ చేస్తున్నాం పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ, విపక్ష ఎంపీల సస్పెన్షన్ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం ఉభయసభల టీఆర్ఎస్ సభ్యులు నల్లటి దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. అయితే విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ ఐదు నిమిషాలకే వాయిదా పడింది. లోక్సభ మాత్రం విపక్షాల నినాదాల మధ్యే కొనసాగుతుండగా టీఆర్ఎస్ సభ్యులు […]
సామాజిక సారథి, హైదరాబాద్: టీఎస్ ఐపాస్ ద్వారా ఇండస్ర్టియల్ పాలసీ తీసుకొచ్చామని, దీని ద్వారా 15 రోజుల్లో అనుమతులు లభిస్తాయని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 17,500 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. రాష్ర్టానికి రూ.2.30వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు రావడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఐఏఎంసీకి అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. పారిశ్రామికీకరణలో దేశంలో […]
రైతులకు సూచించిన సీఎం కేసీఆర్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి మృతికి నివాళి సామాజిక సారథి, జోగుళాంబ గద్వాల: గద్వాల పర్యటనలో భాగంగా గురువారం సీఎం కేసీఆర్ మార్గమధ్యంలో ఆగి మహేశ్వర్రెడ్డి, రాముడు అనే ఇద్దరు రైతులు సాగుచేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. గింజనాణ్యత, రైతులు వాడుతున్న ఎరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరుతడి పంటలే వేయాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. దీంతో రాజకీయ చీడ కూడా తొలగిపోతుందన్నారు. ఆరుతడి పంటల […]