వాషింగ్టన్: ప్రపంచంలో ఏ దేశమైనా కరోనా వ్యాక్సిన్ను తయారుచేస్తే కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. “ మాకు మంచి జరుగుతుంది అంటే కచ్చితంగా వారితో కలిసి పనిచేస్తాం” అని ట్రంప్ అన్నారు. చైనాతో కలిసి పనిచేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్ను డెవలప్ చేసేందుకు అమెరికా కృషి చేస్తోందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని ట్రంప్ మొదటి […]
సారథిన్యూస్, ఓయూ: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఓయూ అరణ్యప్రాంతంలోని ఓ రహస్యప్రాంతంలో అమరణ దీక్ష చేపట్టారు. వీరి దీక్షను అడ్డుకొనేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. ఓయూ పరిసరప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతావలయం ఏర్పాటుచేశారు. అయినప్పటికీ జేఏసీ నేతలు పోలీసుల కండ్లుగప్పి ఆందోళన నిర్వహించారు. ఓయూ జేఏసీ నేతల దీక్షకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ సంఘీభావం తెలిపారు. దీక్ష […]
సారథి న్యూస్, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కరోనా విజృంభిస్తున్నది, గత మూడురోజుల్లో 36 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా బుధవారం ఒక్కరోజు 12 మందికి కరోనా పరీక్షలు చేస్తే 12 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో టెస్టులను మరింత పెంచితే కేసులు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వచ్చిన రోగులను కాంటాక్ట్లను గుర్తించే పనిలో […]
సారథిన్యూస్, నాగర్కర్నూల్: ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన ముంపు బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని నాగర్కర్నూల్ కలెక్టర్ శర్మణ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బిజినేపల్లి మండలం వట్టెంలో పర్యటించారు. అక్కడ ఆర్ అండ్ ఆర్ కింద నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న రెండు తండాల ప్రజల కోసం వట్టెంలో 466 ఇండ్లను నిర్మిస్తున్నారు. ఈ ఇండ్లను ఆయన పరిశీలించారు. లేఅవుట్ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు […]
సారథిన్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి మారుమూల పట్టణాలకు పాకింది. తాజాగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. బుధవారం నుంచి 4రోజుల పాటు పట్టణంలో సంపూర్ణ లాక్డౌన్ పాటించాలని గ్రామపంచాయతీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే కిరాణా దుకాణాలు తెరుస్తామని ఆ సమయంలోనే సరుకులు కొనుగోలు చేయాలని పంచాయతీ పేర్కొన్నది. నిబంధనలు అతిక్రమించినవారికి […]
కరోనా నివారణకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తోంది తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉంది సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా విషయంలో ఎవరుపడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, కోర్టు ఇప్పటికీ 87 పిల్స్ ను స్వీకరించిందని, నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతోందని, ఈ క్లిష్టసమయంలో చేయాల్సిన పనులను వదిలిపెట్టి కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతోందని, దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. […]
బెంగళూరు: కరోనాభయంతో మనుషుల్లో మానవత్వం మంటగలుస్తుంది. సాటి మనిషిపై కనీసం కనికరం లేకుండా పోతున్నది. తాజాగా బెంగళూరులో ఓ దారుణ ఘటన చోటుచేసుకున్నది. కరోనా భయంతో ఓ గర్భిణిని చేర్చుకోవడానికి మూడు ఆస్పత్రులు నిరాకరించాయి. దీంతో ఆ మహిళ ఆటోలోనే ప్రసవించింది. గర్భిణి ప్రాణాలతో భయపడగా.. బిడ్డ మాత్రం మృతిచెందింది. ఆసుపత్రులు కనికరం చూపించి ఉంటే ఆ పసికందు బతికేది. ‘కర్ణాటకలో కరోనా చావులు తక్కువగానే ఉన్నాయి. కానీ కరోనా భయంతో ఆస్పత్రులు వైద్యం నిరాకరించడం వల్ల […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,430 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 47,705కు చేరిన పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు ఏడుగురు మృతిచెందారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 422 కు చేరింది. ఇప్పటిదాకా 2,93, 077 శాంపిళ్ల టెస్టింగ్ చేశారు. తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 703 కరోనా పాజిటివ్కేసులు తేలాయి. రంగారెడ్డి 117, మేడ్చల్105, సంగారెడ్డి 50, ఖమ్మం 14, […]