చెన్నై: కరోనాతో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కోలుకుంటున్నారని.. ఆయనకు కరోనాకు నెగిటివ్ వచ్చిందని సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ వార్త పూర్తిగా అవాస్తవమని ఆయన కుమారుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ తేల్చిచెప్పారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషయమంగానే ఉన్నదని పేర్కొన్నారు. ‘ నాన్నగారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ఆరోగ్యంపై ఏ విషయమైనా […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి భయంకరంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 61,408 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 31,06,349 కు చేరుకుంది. తాజాగా 836 మంది వైరస్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 57,542 కు చేరింది. 57,468 మంది కోవిడ్ పేషంట్లు ఆదివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 23,38,036 కు చేరింది. ప్రస్తుతం 7,10,771 యాక్టివ్ కేసులున్నాయి. ఈ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) 1,842 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,0,6091కు చేరింది. మహమ్మారి బారిన తాజాగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 761కు చేరింది. కాగా, 24 గంటల్లో వైరస్ నుంచి 1,825 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 82,411కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,919 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో వ్యాధిబారిన పడి కోలుకున్నవారి […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని స్థానిక కొత్తపేటలో ఏర్పాటుచేసిన వినాయక చవితి వేడుకల్లో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ పాల్గొన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లలోనే జరుపుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది పండగ కొంత బాధ కలిగిస్తున్నా రేపటి భవిష్యత్ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదన్నారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, నిర్వాహకులు ఉన్నారు.
సారథి న్యూస్, కర్నూలు: విధి నిర్వహణలో కరోనా బారినపడి మృతిచెందిన ఏడుగురు పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాలకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీసు ఆఫీసులో ఏవో సురేష్ బాబు కార్పస్ ఫండ్, విడో ఫండ్, ఫ్లాగ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి కార్పస్ ఫండ్ రూ.లక్ష, విడో ఫండ్ రూ.50వేలు, ఫ్లాగ్ ఫండ్ రూ.25వేల విలువైన చెక్కులను అందజేశారు. ఎంసీ మద్దిలేటి(నందవరం పీఎస్), ఎంపీ పుల్లారెడ్డి(నంద్యాల 3 టౌన్ పీఎస్), ఎస్ఏ మాలిక్(కర్నూలు […]
సారథి న్యూస్, కర్నూలు: కరోనా ప్రబలుతున్న సమయంలో ప్రజలను ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా ఆదివారం కర్నూలు నగరంలోని ముజఫర్ నగర్, ఇందిరాగాంధీ నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, బాలగంగాధర్ తిలక్ నగర్, కల్లూరు, కృష్ణానగర్, షరీన్ నగర్, సీ క్యాంప్ సెంటర్, సోమిశెట్టి నగర్, బీటీఆర్ నగర్, మమతానగర్, అశోక్ నగర్, బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండ్ కూడళ్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి కుటుంబానికి రూ.7,500 ఆరునెలలపాటు ఇవ్వాలని, […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఆదివారం 7,895 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 93 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,282 మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 46,712 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 32,38,038 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వ్యాధిబారి నుంచి తాజాగా 7,449 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 2,60,087 […]
సారథిన్యూస్, ఖమ్మం: ఓ పోలీస్ అధికారి తీసుకున్న చొరువ నిండు ప్రాణాన్ని రక్షించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా రోగులను ఎవరూ దగ్గరికి రానీయడం లేదు. ఈ క్రమంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని పోలీస్అధికారి సకాలంలో దవాఖానలో చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణం.. ఎస్సీ కాలనీకి చెందిన ఒక గర్భిణికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా శుక్రవారం రాత్రి సదరు మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. చుట్టుపక్కల ప్రజలు […]