సారథి న్యూస్, నిజాంపేట: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆయన నిజాంపేటలో సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తే వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆయాగ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మానోపాడు: ఒకవైపు కరోనా మహమ్మారి ఇంకా ప్రబలుతుంటే కొందరేమో సామాజిక దూరం, మాస్కు ధరించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు దగ్గర బ్యాంకు రుణాలపై మహిళా సంఘాలకు, సమైక్య అధికారులు ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది అవగాహన కల్పించారు. అయితే ఈ సమావేశానికి100 మంది దాకా హాజరయ్యారు. అయితే వారేవరూ మాస్కు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
ప్రపంచంలోని మనుషులందరనీ కరోనా మహమ్మారి వణికిస్తున్నది. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు అని తేడా లేకుండా కరోనా బారినపడతున్నారు. అయితే తాజగా టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆమె నుంచి శాంపిల్ సేకరిస్తుండగా చిన్నపిల్లలా బోరున విలపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
భారత్ లో కరోనా విలయతాండవం.. న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుని.. దేశంలో దీని బారినపడిన వారి సంఖ్య 60 లక్షలకు చేరువైంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 88,600 మంది ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533కు చేరింది. వీరిలో 49 లక్షల మందికిపైగా కోలుకోగా.. 9 లక్షలకు పైగా […]
దేశంలో కరోనా టీకాలకు అయ్యే ఖర్చు కేంద్రాన్ని ప్రశ్నించిన సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో న్యూఢిల్లీ : దేశంలో నానాటికీ విజృంభిస్తున్న కరోనాను అంతమొందించడానికి దేశీయంగా పలు ఫార్మా సంస్థలు వ్యాక్సిన్ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా..? టీకా వచ్చినా అది ముందుగా ఎవరికి ఇవ్వాలి..? పంపిణీ ఎలా..? దానికోసమయ్యే ఖర్చు..? అనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావల ఆసక్తికర వ్యాఖ్యలు […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ఉధృతి ఎంతమాత్రం తగ్గడం లేదు. తెలంగాణలో శనివారం కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదయ్యయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 1,83,866 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారిన పడి 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,091కు చేరింది. ఇప్పటివరకు 1,52,441 మంది వ్యాధి వారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,334 యాక్టివ్కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 24,683 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒకేరోజు […]
మూడు దశల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అక్టోబర్ 28న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 28న తొలిదశ (16 జిల్లాలు- 71 నియోజకవర్గాలు), నవంబర్ 3న రెండో […]
సారథిన్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని నిబంధనలతో 25 శాతం బస్సులు నడిపిందేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. నిబంధనలు అమలు చేస్తూ అన్ని రూట్లలో బస్సులు నడపనున్నట్టు సమాచారం. ఈ మేరకు గురువారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ అప్పటి నుంచి హైదరాబాద్లో బస్సులు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నుంచి బస్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 డిపోలలో ఉన్న దాదాపు 2800 […]