మండిపడ్డ బీజేపీ నేత విజయశాంతి సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ నేడు రైతులను మోసగించాలని చూస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. అయితే రైతన్నలు మోసపోయే స్థితిలో లేరని గ్రహించాలన్నారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను ప్రజలు గద్దె దించుతారని ఆమె జోస్యం చెప్పారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి, కాదని వేస్తే కొనుగోలు […]
సంగారెడ్డి జిల్లాలో రైతుబంధు జమ వెల్లడించిన కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి: రైతుబంధు పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో 8 విడతలుగా 2,71,756 మంది రైతుల ఖాతాల్లో 2, 453 కోట్ల 48 లక్షల 26 వేల 654 రూపాయలు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు . జిల్లాలో తొలి విడత 280,50,35,800 రూపాయలు, రెండవ విడత 268 కోట్ల 08 లక్షల 87 వేల 450 రూపాయలు, […]
సామాజిక సారథి, తుర్కయంజాల్: సీఎం కేసీఆర్ కు అన్నదాతల సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలంలోని కర్ణంగూడ గ్రామానికి చెందిన రైతు నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి తన ఇంటికి సరిపోయే విదంగా వేసుకున్న వరిపొలంలో రైతుబంధు రైతుల సంబరాల ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ రైతుబంధు చిత్రంలో రైతులు, కూలీలతో కలిసి ఎమ్మెల్యే నాట్లు వేశారు.కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ కృపేష్, మార్కెట్ కమిటీ […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: గిరి వికాసం పథకం కింద చిన్న, సన్నకారు ఎస్టీ రైతులకు ఉచితంగా బోరు బావి తవ్వించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎస్టీ చిన్న, సన్నకారు రైతులు ఒకరికన్నా ఎక్కువమంది కలసి కనీసం 5 ఎకరాల భూమిని ఒకేచోట కలిగి ఒక యూనిట్ గా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే గిరివికాసం పథకంకింద ఉచితంగా బోర్ […]
ధాన్యం అమ్ముకోలేక నానాఇబ్బందులు డిండి ముంపు రైతులను ఆదుకోవాలి ‘ధరణి’లో తప్పులు ప్రభుత్వ వైఫల్యమే బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్లమలలో కొనసాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్ర సామాజికసారథి, అచ్చంపేట/చారకొండ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడంలేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ధరణి పోర్టల్ లో భూమి తప్పుగా నమోదైందని, భువనగిరి కలెక్టరేట్ […]
సామాజిక సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(డీ82) కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా చెరుకూరు, పరిసర గ్రామాల బాధిత రైతులు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో భాగంగా చెరుకూరు, భర్కత్ పల్లి, గానుగట్టుతండా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెరుకూరు సర్పంచ్ రేవతి రాజశేఖర్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని […]
కొనమని వేడుకున్నా అధికారులు పట్టించుకుంటలేరు రేపటిలోగా కొనపోతే కుప్పపోసి అంటుపెడ్తం మంత్రి హరీశ్రావు ఎదుట అన్నదాతల గగ్గోలు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: ‘నెలరోజులుగా వరి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు గాస్తున్నాం. మా పంటను కొనుగోలు చేయమని వేడుకున్నా అధికారులు స్పందించడం లేదు’ అని రైతులు మంత్రి హరీశ్రావు ఎదుట గోడును వెళ్లబోసుకున్నారు. వడ్లను రైస్ మిల్లు యాజమాన్యాలు కూడా కొనుగోలు చేయడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు. తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఒక్కసారి […]
సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు, సేవలందించడంలో ఉద్యానవన శాఖ విఫలమైందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ఆరోపించారు. వైరా మండలంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం బృందం వైరస్ సోకిన మిర్చి తోటలను గురువారం పరిశీలించింది. పలువురు రైతులు వైరస్ తో దెబ్బతిన్న మిర్చి తోటలను ఈ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మిర్చి సాగులో 50శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, […]