సారథి న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్వో( జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి)గా డాక్టర్ చందూ నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రంగారెడ్డిలో పని చేసిన ఈయన జిల్లా ఇంచార్జీ డీఎంహెచ్వోగా రావడం జరిగింది.
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహా ఇకలేరు శానససభలో ప్రజల తరఫున తనదైన గళం చివరి శ్వాసదాకా ప్రజా ఉద్యమాల్లోనే.. నిజాయితీయే ఆస్తి సారథి న్యూస్, ఇబ్రహీంపట్నం: పోరు కెరటం నెలకొరిగింది.. ప్రజాగొంతుక మూగబోయింది.. దళిత కిరణం ఆరిపోయింది.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత మస్కు నర్సింహా ఇక లేరు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం కరోనాతో ఆరుగురు మృతిచెందారు. మొత్తంగా ఇప్పటి వరకు 148 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో మరో 178 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 143 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 15, మేడ్చల్ జిల్లాలో 10, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. శనివారం కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యియి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3048కు చేరింది. కొత్తగా వచ్చిన కేసులన్నీ స్థానికంగా వచ్చినవే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో మొత్తం 448 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటితో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3496కు చేరింది. కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసుల్లో 152 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన […]