Breaking News

క్రైమ్

నా చావుకు కారణం ఎమ్మెల్యే పెద్ది

సారథిన్యూస్​, హన్మకొండ: ‘నా చావుకు కారణం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి, కేసీఆర్​ సార్​.. వచ్చే ఎన్నికల్లో అతడికి టికెట్​ ఇవ్వొద్దు’ అని లెటర్​ రాసి ఓ వ్యక్తి గొంతు కోసుకున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లా అలంకానిపెట చెందిన మాసం వెంకటేశ్వర్లు సోమవారం హన్మకొండలోని అదాలత్ వద్ద అమరవీరుల స్తూపం ముందు కత్తితో గొంతు కోసుకున్నాడు. రక్తం ధారలు కట్టడంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం […]

Read More

దోపిడీ గ్యాంగ్​ అరెస్ట్​ ​

భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ జంటలను బెదిరించి వారివద్ద డబ్బు, నగలు దోపీడి చేస్తున్న ఓ ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. రేగళ్ల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్​ చేస్తుండగా వీరు పట్టుబడ్డారని చెప్పారు. జిల్లాకు చెందిన ఓ ఆరుగురు ముఠాగా ఏర్పడి ప్రేమజంటలను కత్తులు, మారణాయుధాలతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరిపై దోపీడీ, దొంగతనం కేసులున్నాయని సీఐ అశోక్​చ ఎస్సై ప్రవీణ్​కుమార్​ తెలిపారు. వీరి వద్ద నుంచి 10 తులాల […]

Read More

లారీ డ్రైవర్​ సజీవదహనం

సారథిన్యూస్​, అనంతపురం: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీ డ్రైవర్​ సజీవదహనమయ్యాడు. ఈఘటన అనంతరం జిల్లా తాడిపత్రి సమీపంలోని కడప రహదారిపై చోటుచేసుకున్నది. తాడిపత్రి నుంచి ఓ లారీ వరిపొట్టు లోడుతో వస్తున్నది. ఈ లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన లారీడ్రైవర్​ నిశార్​ సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు

Read More

సెల్​ఫోన్​ కొనివ్వలేదని..

సారథిన్యూస్​, జనగామ: సెల్​ఫోన్​ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవాపురంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన శ్రీకాంత్​(20) కొంతకాలంగా సెల్ ఫోన్​ కొనివ్వాలంటూ తల్లిదండ్రులు అడుతున్నాడు. ఆర్థికపరిస్థితి బాగా లేకపోవడంతో వారు కొనివ్వలేకపోయారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్​ పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

Read More
భార్య మరణాన్ని జీర్ణించుకోలేక..

భార్య మరణాన్ని జీర్ణించుకోలేక..

సారథి న్యూస్, హుస్నాబాద్: తోడు లేని జీవితం అంతలోనే ముగిసింది.. కడ దాకా నీడగా ఉండాల్సిన భార్య అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఆ హృదయం కన్నీటితో బరువెక్కింది. భార్య చనిపోయిన పదవ రోజునే ఆ భర్త గుండె ఆగిపోయింది. మరికొన్ని గంటల్లో ద్వాదశ దినకర్మ జారగల్సి ఉన్న ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం హుస్నాబాద్ పట్టణంలో ప్రతి ఒక్కరినీ కంట కన్నీరు పెట్టించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొత్తపల్లి లక్ష్మి […]

Read More

భార్య గొంతుకోశాడు ఆపై..

చెన్నై: దుర్మార్గుడైన ఓ వృద్ధుడు భార్య గొంతుకోసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో వెలుగుచూసింది. పెరుంగలాథూర్ ప్రాంతంలోని డేవిడ్ నగర్​లోని ఓ ఫ్లాటులో జగన్నాథన్ (72), అతడి భార్య సులోచన (62)లు నివాసముండేవారు. అపార్టుమెంట్ పై జగన్నాథన్ మృతదేహాన్ని చూసిన అపార్టుమెంటు వాసులు విషయాన్ని ఆమె భార్యకు చెప్పేందుకు వారి ఫ్లాటుకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో సులోచన కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇద్దరి […]

Read More
బాబాయ్ ని చంపిన అబ్బాయ్​

బాబాయ్ ని చంపిన అబ్బాయ్​

సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్ల పహాడ్ గ్రామంలో ఆదివారం దారుణం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మద్యం తాగిన మైకంలో సొంత బాబాయ్ లచ్చయ్య(55)ను గొడ్డలితో అన్న కొడుకు వెంకన్న నరికి చంపాడు. తీవ్రమైన రక్తపు మడుగులో లచ్చయ్య అక్కడికక్కడే చనిపోయాడు. నిందితుడు వెంకన్న పరారీలో ఉన్నాడు. ఈ దారుణఘటనకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.

Read More

వైద్యం వికటించి వ్యక్తి మృతి

బిజినేపల్లి , సారథి న్యూస్​: ఆర్​ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆగ్రహించిన బాధితుడి కుటుంబసభ్యులు ఆర్​ఎంపీ దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఆర్​ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూర్​కు చెందిన శ్రీనివాస్​రెడ్డి(35) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు అదే గ్రామంలోని వేంకటేశ్వర ప్రాథమిక చికిత్స కేంద్రం లో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడికి పెరాలసిస్ వచ్చినట్టు నిర్దారించుకొన్న వైద్యుడు అతడికి మందులు, […]

Read More