4 నెలల క్రితం తండ్రిని…ఇప్పుడు భార్యని.. అక్రమ సంబంధం అనుమానంతో ఇద్దరినీ హతమార్చిన వ్యక్తి పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాలో దారుణం.. తండ్రి కేసులో జైలు నుంచి వచ్చిన పది రోజులకే భార్యను చంపిన నిందితుడు సారథిన్యూస్, పెన్ పహాడ్ : సొంత తండ్రే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం సజావుగా సాగుతున్న సంసారంలో చిచ్చుపెట్టింది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాకు చెందిన లునవత్ స్వామి, […]
సారథిన్యూస్, అమరావతి: సరదాగా ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారులు డోర్ లాక్కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో చోటు చేసుకుంది. అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు ఆడుకోవడం కోసం తమ ఇంటి దగ్గర పార్క్ చేసిన కారులోకి ఎక్కారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ కారు డోర్ లాక్ అయ్యింది. దీంతో ఆ చిన్నారులు బయటకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురు […]
సారథిన్యూస్, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా.. ఖమ్మం రూరల్ మండలం… మంగళగూడెం గ్రామానికి చెందిన గోపీకృష్ణ (26)కు 2018లో భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన నందిని(26)తో వివాహమైంది. వీరిద్దరూ కొడైకెనాల్లోని ఓ ఐటీకంపెనీలో పనిచేస్తున్నారు. సంవత్సరం నుంచి అన్నయ్ థెరిస్సా యూనివర్సిటీ దగ్గర్లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి దంపతులు తమ ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీళ్లకు కిరాణా సరుకులు తెచ్చిచ్చే […]
వేటపాలెం : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో బైక్ను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం కర్నూలు నుంచి చీరాలకు వేటపాలెం మండలం అక్కాయి పాలెం జాతీయరహదారి ప్తె వస్తున్న కారు ముందుగా వెళ్తున్న బైక్ను తప్పించుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ప్రమాదం లో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి..ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]
సారథి న్యూస్, పెబ్బేరు: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. తాజాగా వనపర్తి జిల్లా పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో సూగూర్ వీఆర్వో రూ. 6,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సూగూరుకు చెందిన ఆంజనేయులు అనే రైతుకు కొంతకాలంగా అతడి సోదరుల మధ్య భూవివాదం నడుస్తున్నది. వీరి భూసమస్యను పరిష్కరించేందుకు వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. కాగా, ఆంజనేయులు ఏసీబీని సంప్రదించాడు. రంగంలోకి దిగిన అధికారులు గురువారం […]
సారథి న్యూస్, ఖమ్మం: బావిలో పడి ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం కొణిజర్లకు చెందిన ఐదుగురు వ్యవసాయ కూలీలు ఓ పొలంలో పనిచేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారు జారి బావిలో పడ్డారు. స్థానికులు గమనించి ముగ్గురిని కాపాడగా, మరో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సారథిన్యూస్, పెద్దపల్లి: ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా రాఖీ కడుదామనుకున్న ఓ సోదరి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఆ మహిళను బలితీసుకున్నది. సోదరుడి చేతుల్లోనే ఆ యువతి ప్రాణాలు విడిచింది. ఈ విషాధ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని రాజీవ్ రహదారిపై శనివారం చోటుచేసుకున్నది. పెద్దపల్లి జిల్లాకు చెందని ఓ మహిళ రాఖీ పౌర్ణమి పండుగకోసం తన సోదరుడితో కలిసి గోదావరిఖనికి బైక్పై వస్తుండగా.. రాజీవ్ […]
రాయ్పూర్ : త్రిపురలో యువతిపై అయిదుగురు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన మరవకముందే మరో పైశాచిక సంఘటన ఛత్తీస్గఢ్లో వెలుగు చూసింది. బలోదబజార్ జిల్లాలో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెల్లపై 11 మంది అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దృశ్యాలను వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ ఘటన జరిగిన రెండు నెలలకు వెలుగులోకి రావడం గమనార్హం. ఇద్దరు బాలికలపై గ్రామానికి చెందిన 8 మంది యువకులు, ముగ్గురు […]