Breaking News

క్రైమ్

ఆన్​లైన్ క్లాసెస్​.. విద్యార్థినులు షాక్​

ఆన్​లైన్ క్లాసెస్​.. విద్యార్థినులు షాక్​

కర్నూలు: ఆన్​లైన్​ క్లాసెస్​ వింటున్న విద్యార్థినులు ఉన్నట్టుండి ఒక్కసారిగా షాక్​ తిన్నారు. ఓ స్కూలుకు సంబంధించిన బాలికల వాట్సప్ గ్రూపులో అశ్లీల వీడియో ప్రత్యక్షమవడంతో కంగుతిన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ బాలికల హైస్కూలు విద్యార్థినులకు ఆన్‌లైన్ తరగతుల కోసం ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటుచేశారు. 8వ తరగతి విద్యార్థినులకు చెందిన ఆ గ్రూపులో ఇటీవల గుర్తుతెలియని ఓ వ్యక్తి అశ్లీల వీడియోను పోస్టుచేశాడు. ఆ గ్రూపులో ఆ వీడియో రెండు రోజుల పాటు అలాగే ఉంది. […]

Read More
తుంగభద్రలో యువకుడి డెడ్​బాడీ లభ్యం

తుంగభద్రలో తేలిన యువకుడి డెడ్​బాడీ

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర నదిలో పుట్టిలో వెళ్తూ గల్లంతైన రవికుమార్ మృతదేహం ఆచూకీ మంగళవారం దొరికింది. నదిలోనే చేపలవలకు ​డెడ్​బాడీ చిక్కింది. పోస్టుమార్టం కోసం అలంపూర్ ​ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, తుమ్మిళ్ల గ్రామానికి చెందిన అంజి, రాఘవేంద్ర ప్రతిరోజు మద్యం సరుకును తుంగభద్ర నది నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రవికుమార్ కు చెందిన పుట్టిలో 36మద్యం కేసులను తీసుకుని అవతలి వైపునకు దాటుతున్నారు. మార్గమధ్యంలో పుట్టి మునిగిపోవడంతో […]

Read More

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

నడియాడ్‌: ఎదురెదురుగా వస్తున్న రెండుకార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పయారు. ఈ ఘటన గుజరాత్​ రాష్ట్రంలోని అహ్మదాబాద్-వడోదర 8వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నడియాడ్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించినట్లు అగ్నిమాప‌క‌శాఖ సూప‌రింటెండెంట్ దీక్షిత్ ప‌టేల్‌ తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Read More

ప్రభుత్వ భూమి కబ్జా.. 40 మందిపై కేసు

పుట్టాన్‌దొడ్డి(ఇటిక్యాల): ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్‌దొడ్డి శివారులో 171, 172 సర్వేనంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. దీనిపై రెవెన్యూ సిబ్బంది బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి ఆక్రమించేందుకు యత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

Read More
WANAPARTHY

ఒకే ఇంట్లో నలుగురు మృతి

సారథి న్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్​లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. నాగపూర్​కు చెందిన అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా నస్రీన్​ (10) శుక్రవారం తమ ఇంట్లో మృతిచెందారు. ఇంట్లో ఈ నలుగురు విగతజీవులుగా పడిఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వంట గదిలో అజీరాం బీ, హాల్‌లో హాసీనా, డైనింగ్ హాల్‌లో […]

Read More

టీలో మత్తుమందు ఇచ్చి అత్యాచారం

తూర్పుగోదావరి: ఎన్ని కఠినచట్టాలు వచ్చినా మృగాళ్ల ఆలోచనలో ఏ మార్పు రావడం లేదు. తాజాగా ఓ దుర్మార్గుడు ఓ బాలికకు టీలో మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ దారుణఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మామాడికుదురు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన బాలిక కుటుంబంతో అదే గ్రామానికి చెందిన గుబ్బల రాజేంద్ర కుమార్​ (21) సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రాజేంద్ర బాలిక ఇంటికి వెళ్లాడు. అనంతరం బాలికకు, […]

Read More
బెజవాడలో భారీ అగ్నిప్రమాదం

కోవిడ్​సెంటర్​లో మంటలు.. 11 మంది మృతి

సారథిన్యూస్​, విజయవాడ: విజయవాడలోని ఓ కోవిడ్​ సెంటర్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు 11 మంది కరోనా రోగులు మృతిచెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ హోటల్​ స్వర్ణప్యాలెస్​ను కోవిడ్​ కేర్​ సెంటర్​గా వినియోగిస్తున్నారు. ఈ హోటల్​లో దాదాపు 40మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున షార్ట్​సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో కరోనా బాధితులు కేకలు పెట్టారు. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. […]

Read More
ఎట్టకేలకు సెంట్రల్ జైలుకు..

ఎట్టకేలకు సెంట్రల్​ జైలుకు..

సారథిన్యూస్​, నల్లగొండ : నకిలీ విత్తనాల కేసులో కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మధుసూదన్​రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు చండూర్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం భారీగా నకిలీ పట్టివిత్తనాలు పట్టుకున్న నల్లగొండ జిల్లా పోలీసులు కేసులో విచారణ పూర్తి చేసి ఎస్పీ ఏవీ రంగనాథ్​ ఆదేశాల మేరకు.. సీఐ సురేష్ కుమార్ శనివారం మధుసూదన్​రెడ్డిని వరంగల్ కు తరలించారు. నల్లగొండ కలెక్టర్ ఆదేశాల మేరకు […]

Read More