అధిష్టానం మెచ్చినోడు.. బరి గీసి నిలిచినోడు.. ప్రజల మనసును గెలిచినోడు.. పేదల మన్ననలు పొందినోడు ఆయనే ఆరూరి రమేష్ ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. సామాజిక సారథి,వరంగల్ ప్రతినిధి: అధిష్టానం మెచ్చినోడు..బరి గీసి నిలిచినోడు.. ప్రజల మనసును గెలిచినోడు..పేదల మన్ననలు పొందినోడు..వెనకబడిన తరగతిలో పుట్టినోడు.. ఆయనే అరూరి రమేష్.. ప్రస్తుతం వర్ధన్నపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక సారథి ప్రత్యేక కథనం.. నియోజకవర్గ ప్రజలకు […]
సామాజిక సారథి, సంగారెడ్డి: వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా 2022 వ సేవ సంవత్సరానికి సంగారెడ్డి పట్టణానికి చెందిన చంద శ్రీధర్ ఎన్నికయ్యారు. విజయవాడ పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన చంద శ్రీధరతో అంతర్జాతీయ అద్యక్షలు పాత సుదర్శన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్బంగా వాసవి క్లబ్ జిల్లా ప్రతినిధులు చంద శ్రీధర్ ను అభినందించారు.
రాష్ట్రంలో ఇద్దరి మృతి సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో 146 కరోనా కేసులు ఆదివారం నమోదయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. 24 గంటల్లో 26,625 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 146 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 72 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 189 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,78,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,70,435 మంది […]
ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: సంఘటిత, సమర్థ, స్వాభిమాన భారత్ ను రూపొందించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇదే హిందూ శక్తి సంగమం సందేశమని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తత్రేయ హోసబలే పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో హిందూ శక్తి సంగమం పేరుతో శనివారం నిర్వహించిన జిల్లా మహాసాంఘిక్ సార్వజనికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. […]
జోరుగా మద్యం వ్యాపారుల దోపిడీ బినామీ లైసెన్సులతో వ్యాపారం డబ్బు మత్తులో ఏక్సైజ్ శాఖ లబోదిబోమంటున్న మద్యం ప్రియులు సామాజిక సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాపులు యజమానులు సిండికేట్ గా మారారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అధికధరలతో మద్యం విక్రయిస్తూ మద్యం మత్తులో ఉన్న మందుబాబులను డబ్బును దోచేస్తున్నారు. ఒక్కొక్క క్వార్టల్ బాటిల్ పై రూ.20 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. […]
సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని శాంతినగర్ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ అగంతకుడు తెంచుకొని పారిపోయిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దేవభక్తిని లక్ష్మి అనే మహిళ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద శబరి కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహానికి వెళ్లేందుకు ప్రధాన రహదారిపై బస్సు దిగి నడుచుకుంటూ మరో ఇద్దరు మహిళలతో కలిసి వెళుతుంది. ఈ సమయంలో […]
సామాజికసారథి, హైదరాబాద్: అల్లు అర్జున్ ప్రధానపాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన ఈ ప్రీ రిలీజ్ వేడుకకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ గా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు విశేష స్పందన […]
కంటోన్మెంట్లోని బ్రార్ స్క్వేర్లో అంత్యక్రియలు నివాళులర్పించిన రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు న్యూఢిల్లీ: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13మందిలో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్హర్జిందర్ సింగ్ భౌతికకాయానికి రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, సహాయ మంత్రి అజయ్భట్, త్రివిధ దళాల అధిపతులు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, నేవీ అడ్మిరల్ హరికుమార్ ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలకు ముందు ఢిల్లీ […]