దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: గణపతి చక్కెర పరిశ్రమ యాజమాన్యం కార్మికుల మధ్య చిచ్చుపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే, పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షుడు రఘునందన్ రావు అన్నారు. నూతన వేతన సవరణ కోసం గణపతి పరిశ్రమ రెగ్యులర్ ఉద్యోగులు గత 23 రోజులుగా పరిశ్రమ ఎదుట సమ్మె నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే, చెరుకు క్రషింగ్ ప్రారంభం అయ్యే సమయం దగ్గర పడటంతో సీజనల్ కార్మికులు […]
సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కు భూ కబ్జాలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి బీఎస్పీ కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, జనగాం: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతోనే లక్షలాది మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ, వడ్ల కుప్పలపై మరణించే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని బీఎస్పీ కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జనగాం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బీఎస్పీ జిల్లా మహాసభకు ముఖ్య […]
సామాజిక సారథి, ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డులో గురువారం సాయంత్రం నాటుసారా స్థావరాలపై జిల్లా ఎక్సైజ్ ట్రాస్క్ ఫోర్స్ సీఐ పోశెట్టి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో సిబ్బంది రాజు, మధు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి సామాజిక సారథి, నాగర్కర్నూల్ ప్రతినిధి: రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగానికి మద్దతుగా నిలబడుతూ రైతు ఉద్యమానికి ఆయుపట్టుగా వచ్చిన రైతన్న సినిమాను ఆదరించాలని ప్రముఖ సినీనటుడు, పీపుల్స్స్టార్ఆర్.నారాయణమూర్తి కోరారు. ఈనెల 27న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రామకృష్ణ టాకీస్ లో మొదటి ఆటను చూద్దామన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా గురువారం నాగర్కర్నూల్కు వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎం, సీపీఐ జిల్లా నాయకులు, […]
సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు, సేవలందించడంలో ఉద్యానవన శాఖ విఫలమైందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ఆరోపించారు. వైరా మండలంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం బృందం వైరస్ సోకిన మిర్చి తోటలను గురువారం పరిశీలించింది. పలువురు రైతులు వైరస్ తో దెబ్బతిన్న మిర్చి తోటలను ఈ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మిర్చి సాగులో 50శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, […]
సామాజిక సారథి, చిలప్ చెడ్: మండల కేంద్రం చిలప్ చెడ్ లో షార్ట్ సర్క్యూట్ తో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదసమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం, స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గొట్టం మధు కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా చిట్కుల్ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన చాముండేశ్వరి ఆలయానికి వెళ్లారు. మధు ఇంటిలో నంచి పొగలు వస్తుండటం స్థానికులు […]
సామాజిక సారథి, సిద్దిపేట: జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ పోచమ్మ అమ్మవారిని మంత్రి హరీశ్రావు దర్శించుకున్నారు. గురువారం ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా సుభిక్షంగా ఉండేలా దీవించు తల్లీ అని వేడుకున్నారు. ఈ మేరకు ఆలయ సవిూపంలో ఓ భక్తుడు వేయించిన సదరు పట్నంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి వెంట ఎప్డీసీ చైర్మన్ […]
ప్రజలకు సూచించిన మంత్రి హరీశ్ రావు సామాజి సారథి, ములుగు: మొదటి డోస్ వేసుకున్నంత వారంతా తప్పనిసరిగా రెండవ డోస్ వేయించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు క్షీరసాగర్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల మమత బాల్ రెడ్డి వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేయడం అభినందనీయమని ప్రశంసించారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్ రెడ్డి తండ్రి […]