మారటోరియంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచనలు కరోనా వ్యాప్తి కారణంగా సెప్టెంబర్ 28 వరకు మారటోరియం న్యూఢిల్లీ: రుణ వాయిదాల విషయంలో సామాన్యులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కరోనా వ్యాప్తి కారణంగా ఆర్బీఐ మార్చిలో మూడు నెలల పాటు తాత్కాలిక నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. ఈ సదుపాయాన్ని మార్చి 1 నుంచి మే 31 వరకు మూడు నెలల పాటు అమలు చేశారు. తర్వాత దీనిని ఆగస్టు 31 వరకు మరో మూడు […]
నకిలీ లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి.. చెన్నై: ఆరుగాలం కష్టపడే రైతులకు పంటలు సాగు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘కొద్దిపాటి సాయం’ కూడా వారికి అందకుండాపోతోంది. నకిలీ లబ్ధిదారులను చూపిస్తూ పలువురు అధికారుల అండతో రైతులకు అందాల్సిన నగదును కూడా అవినీతి తిమింగళాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అన్నదాతలకు నగదు సాయం అందించే ‘పీఎం కిసాన్’ పథకంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలు ఇలా.. నకిలీ […]
‘ఈ భూమి నాది.. పండించిన పంటనాది.. తీసుకెళ్లడానికి దొరెవ్వడు.. నా పాణం పోయాకే ఈ పంట, భూమిని మీరు దక్కించుకోగలరు’ అంటూ మాటలను తూటాలుగా మల్చుకుని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ. ఆమె వీరత్వం ఎంతో మంది గుండెల్లో ధైర్యం నింపింది. ఎందరికో ప్రశ్నించేతత్వం నేర్పించింది. దేశ్ముఖ్లు, భూస్వాములను తరిమికొట్టేలా చేసింది. 1919లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలు దంపతులకు నాలుగవ సంతానంగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో పెరిగిన కరోనా ఉధృతి పెరుగుతోంది. గురువారం 2,534 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,50,176కు చేరింది. తాజాగా, మహమ్మారి బారినపడి 11 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 927కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్కేసులు 32,106 ఉన్నాయి. ఐసోలేషన్25,066 మంది ఉన్నారు. ఇదిలాఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 327 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 23, భద్రాద్రి కొత్తగూడెం 81, […]
వాయుసేనలోకి ఐదు విమానాలు మరింత పెరిగిన భారత ఎయిర్ఫోర్స్ బలం అంబాలా: కొద్దిరోజుల క్రితమే ఫ్రాన్స్ నుంచి భారత్కు వచ్చిన రాఫెల్ ఫైటర్ జెట్లు ఫీల్డులోకి దిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో గురువారం ఆ ఐదు విమానాలు భారత వాయుసేనలో చేరాయి. దీంతో మన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలకు తోడు రాఫెల్ కూడా జతకలవడంతో భారత ఎయిర్ఫోర్స్ బలం మరింత పెరిగింది. తాజాగా ఎల్ఎసీ వద్ద చైనా వరుసగా దుస్సాహసాలకు […]
రెండురోజుల్లోనే సుమారు రెండు లక్షల కరోనా కేసులు మహారాష్ట్రలో 9 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వారంలో మొదటి రెండ్రోజుల్లో 80వేల లోపు నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసులు.. బుధవారం నుంచి మళ్లీ 95వేలు దాటాయి. బుధవారం దేశవ్యాప్తంగా 97,399 కేసులు రాగా.. గురువారం ఆ సంఖ్య 95,735 కు చేరింది. దీంతో రెండు రోజుల్లోనే భారత్లో సుమారు రెండు లక్షల (1,93,134) మంది మహమ్మారి బారిన పడ్డారు. […]
ఫేస్బుక్ పై ఆ సంస్థ ఉద్యోగి తీవ్ర ఆరోపణలు విలువలు లేని సంస్థలో పనిచేయలేనని రాజీనామా వాషింగ్టన్: విద్వేషాలు, రెచ్చగొట్టే ప్రసంగాలను ప్రోత్సహిస్తూ ఫేస్బుక్ లాభం పొందుతోందని ఆ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశారు. కొద్దిరోజులుగా ఫేస్బుక్ అనుసరిస్తున్న వైఖరి, విధానాలు నచ్చక చాలామంది ఉద్యోగులు బహిరంగ లేఖలు రాస్తూ రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫేస్బుక్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ (సంస్థలో ఎక్కువ వేతనాలు పొందేవాళ్లలో వీళ్లు ఒకరు)గా పనిచేస్తున్న […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ పరిధిలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ సంబంధిత అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్లిస్టులో పెట్టాలని సూచించారు. అనుమతి పొందిన నిర్మాణ పనుల కోసం సిద్ధంచేసిన ప్రతిపాదనలను అనుసరించి పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈనెల 20న జరిగే సచివాలయ ఉద్యోగ పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎస్ఈ సురేంద్రబాబు, ఎంఈ 2 రమణమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్ గౌడ్, […]