సారథి న్యూస్, హైదరాబాద్: నడిపేది ట్రాలీ ఆటో.. జీవన శైలిలో విలాసవంతమైన మార్పు. అప్పులు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి చేరిక.. 2.35 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు.. ఇదంతా ఎలా సాధ్యమంటూ ఆరా తీస్తే.. అసలు సంగతి తెలిసి ఔరా అంటూ ఎల్బీనగర్ పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. మరదలితో చోరీ చేయించి.. ఆ డబ్బుతో జల్సా చేస్తున్న బావ ఆట కట్టించారు. రూ.25.5 లక్షలు, రూ.22 లక్షల విలువైన వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను […]
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 45,720 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మొత్తం కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. కాగా ఒకే రోజులో 29,557మంది కోలుకున్నారు. కాగా ఇప్పటివరకు 7,82,606 మంది కోలుకున్నారు. ఇప్పటివకరు 29,861 మంది ఈ వ్యాధితో మరణించారు. దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసుల […]
సారథి న్యూస్, పశ్చిమ గోదావరి: తెలంగాణా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ జీలుగుపల్లి చెక్పోస్ట్ వద్ద మెరుపుదాడి చేసి పట్టుకుంది. తెలంగాణ నుంచి ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద ఎస్ఈబీ ఏఎస్పీ కరీముల్లా షరీఫ్ దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.20లక్షలు ఉంటుంది. ఈ కేసులో సుమారు 20 లక్షల విలువచేసే 4275 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని […]
అప్పులబాధ భరించలేక ఓ సీరియల్ నటి, గాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి కొంతకాలం టీవీ సీరియల్స్ నటించింది. తర్వాత అవకాశాలు తగ్గడంతో గుంటూరుకు వెళ్లింది. అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్య అనే రియల్ఎస్టేట్ వ్యాపారిని వివాహం చేసుకున్నారు. గుంటూర్ విద్యానగర్లో ఉంటున్న రేఖ పెళ్లి వేడుకల్లో పాటలు పాడటం, యాంకరింగ్ […]
సారథిన్యూస్, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా హైదరాబాద్ సహా ఏడు చోట్ల ఈనెల 25న నిర్వహించాల్సిన జాతీయ ఫార్మా విద్య, పరిశోధన సంస్థ (నైపర్) జేఈఈని వాయిదా వేశారు. ఈ పరీక్షను సెప్టెంబర్ 28న నిర్వహించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ పరిశోధన సంస్థలు ఫార్మసీ విద్యలో పీజీ కోర్సులను అందిస్తున్నాయి.
సారథిన్యూస్, హైదరాబాద్: ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్యప్రణాళికను తెలంగాణ ఇంటర్బోర్డు మార్చబోతున్నది. ఇందుకోసం నిపుణుల కమిటీని నియమించింది. తెలంగాణ పదాలు, సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది(2020-21) ఫస్టియర్లో చేరబోయే విద్యార్థులకు ఈ కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. 2021-22 విద్యా సంవత్సరానికి ద్వితీయ సంవత్సరంలోనూ కొత్త పాఠ్య ప్రణాళికతో పుస్తకాలు రూపొందుతాయి. తెలంగాణ రచయితలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇంటర్బోర్డు వర్గాలు తెలిపాయి.
సారథి న్యూస్, హైదరాబాద్: గ్రూప్-2లో ఎంపికైన డిప్యూటీ తహసీల్దార్లకు (ప్రొబెషనరీ డిప్యూటీ తహసీల్దార్లు/డీటీలు) పోస్టింగ్లపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 259 మంది ఎంపిక కాగా 257 మంది మాత్రమే జాయినింగ్ ఆర్డర్లు సమర్పించారు. వీరిని రెండ్రోజుల్లో విధుల్లోకి తీసుకోవాలంటూ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఆదేశించారు. 2016లో ఎంపికైన వీరికి గతేడాది నవంబరులో ప్రభుత్వం అపాయింటుమెంట్లు కల్పించింది. పోస్టింగ్ల కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన […]
టాలీవుడ్లో హీరో సత్య దేవ్ కి అభిమానులు ఎక్కువే. చేసిన సినిమాలు తక్కువే అయినా తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు హీరో సత్యదేవ్. అయితే రీసెంట్గా గోపీ గణేష్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి చూశారట. సినిమా నచ్చడంతో గోపీని, సత్యదేవుడిని ప్రత్యేకంగా ఇంటికి పిలిచి మాట్లాడారట. చిరంజీవిని కలిసి ముచ్చటించిన గోల్డెన్ మూమెంట్స్ను తను ఎప్పటికీ మరిచిపోలేనని, తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా తెలుపుతూ.. ‘చిరంజీవి అంటే నాకు చిన్నప్పటి నుంచీ […]