సారథి న్యూస్, పశ్చిమ గోదావరి: తెలంగాణా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ జీలుగుపల్లి చెక్పోస్ట్ వద్ద మెరుపుదాడి చేసి పట్టుకుంది. తెలంగాణ నుంచి ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద ఎస్ఈబీ ఏఎస్పీ కరీముల్లా షరీఫ్ దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.20లక్షలు ఉంటుంది. ఈ కేసులో సుమారు 20 లక్షల విలువచేసే 4275 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని వాహనం డ్రైవర్ను అరెస్ట్ చేశారని సమాచారం.. జంగారెడ్డిగూడెం కేంద్రంగా మాఫియా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
- July 23, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- పశ్చిమగోదావరి
- ARREST
- LICQOUR
- SEB
- అరెస్ట్
- ఎస్ఈబీ
- లిక్కర్
- Comments Off on భారీగా అక్రమ మద్యం పట్టివేత