Breaking News

భారీగా అక్రమ మద్యం పట్టివేత

భారీగా అక్రమ మద్యం పట్టివేత

సారథి న్యూస్​, పశ్చిమ గోదావరి: తెలంగాణా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్​కు తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ జీలుగుపల్లి చెక్​పోస్ట్​ వద్ద మెరుపుదాడి చేసి పట్టుకుంది. తెలంగాణ నుంచి ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని  తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు  జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద ఎస్​ఈబీ ఏఎస్​పీ కరీముల్లా షరీఫ్​ దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.20లక్షలు ఉంటుంది. ఈ కేసులో సుమారు 20 లక్షల విలువచేసే 4275 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని వాహనం డ్రైవర్​ను అరెస్ట్​ చేశారని సమాచారం.. జంగారెడ్డిగూడెం కేంద్రంగా మాఫియా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.