సారథిన్యూస్, రామడుగు: ఇటీవల కొంతకాలంగా కురుస్తున్న భారీవర్షాలు రైతాంగాన్ని నిండా ముంచాయి. ఈ జోరువానతో ఇప్పటికే పలుచోట్ల పాతమిద్దెలు కూలిపోయాయి. పలువురు గాయపడ్డారు. వరదతాకిడికి కొందరు గల్లంతయ్యారు. కరీంనగర్ జిల్లా రామడుగు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. గాంకుంట్ల చెరువు సమీపంలోని లోతట్టు ప్రాంతంలో స్కూలు నిర్మాణం చేపట్టడంతో నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. కరోనా లాక్ డౌన్ కావడంతో ఎవరూ ఈ పాఠశాలను పట్టించుకోవడం లేదు. రోజు ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం […]
సారథి న్యూస్, హైదరాబాద్: విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం యావత్ తెలంగాణ ప్రజల హక్కు అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) రాష్ట్ర ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. గురువారం వీహెచ్పీ, భజరంగ్ దళ్ సంస్థల ఆధ్వర్యంలో హైదారాబాద్ కోఠి బాలగంగాధర్ తిలక్ చౌరస్తాలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో నిజాం రజాకార్ల దోపిడీ పాలన సాగుతూ ఉండేదని […]
సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ, స్థానిక ఆర్డీవో కార్యాలయల్లో బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికారంలో ఉండి కూడా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి భయపడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వెయ్యి మందిని బలితీసుకుంది. ఈ క్రమంలో గురువారం రాష్ట్రంలో (24 గంటల్లో) 2,159 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి బారినపడి తాజాగా 9 మంది మృతిచెందారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 1,005 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,65,003కు చేరింది. తాజాగా వ్యాధి నుంచి 2,108 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,33,555కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 యాక్టివ్కేసులు […]
సారథి న్యూస్, మెదక్: ప్రజలు కోరుకున్న పనులను చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం మెదక్ నియోజకవర్గంలోని నార్సింగి మండలంలో పలు అభివృద్ధి పనులకు మెదక్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీఎంజీఎస్వై కింద దుబ్బాక నియోజకవర్గానికి మంజూరైన రోడ్డును దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి నార్సింగి […]
సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్మిస్తున్న 461 శ్మశాన వాటికలు,143 రైతు వేదికల నిర్మాణాలు అక్టోబర్ 15 నాటికి పూర్తికావాలని కలెక్టర్ఎల్.శర్మన్ ఆదేశించారు. సంబంధిత ఇంజనీరింగ్అధికారులతో ఆయన సమీక్షించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులకు ఇప్పటివరకు బిల్లులు మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో సర్పంచ్లు నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనుల్లో పురోగతి లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కంప్లీట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రైతు […]
సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తూ పబ్బం గడుపుతోందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఆర్.మానస కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం ఇస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువత […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: లక్షణాలు ఉన్నవాళ్లందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మెదక్ జిల్లా కంగ్టి పీహెచ్సీ డాక్టర్ మనోహర్రెడ్డి సూచించారు. మండలంలో రోజురోజుకూ కరోనా పెరుగుతున్నదని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. భౌతికదూరం పాటించాలని సూచించారు. బుధవారం కంగ్టి పీహెచ్సీలో కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారందరినీ క్వారంటైన్లో ఉండాలని ఆయన సూచించారు.