సారథి న్యూస్, మెదక్: జిల్లావ్యాప్తంగా రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా వాటిని అందుబాటులోకి తీసుకురావాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు. మంగళవారం జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ డీఈలు, ఏఈలు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయధికారులు, విస్తరణాధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులు చాలా […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య(680 కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. నాయిని నర్సింహారెడ్డి ఈనెల 22న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇటీవల నాయిని, ఆయన భార్య అహల్య కరోనా బారినపడ్డారు. దీంతో ఇద్దరు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. భర్త నాయిని నర్సింహారెడ్డి మృతితో చివరి చూపునకు అహల్యను కుటుంబసభ్యులు అంబులెన్స్లో ఇంటికి తీసుకొచ్చారు. కరోనా నెగటివ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: జియాగూడలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు సామెత చెబుతుంటారు. ఈ రెండు పనులు చేయడమంటే కష్టంతో కూడుకున్న పని. కానీ ఇల్లు నేను కట్టిస్తా. పెండ్లి నేను చేస్తా అన్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రమే’ అని సృష్టంచేశారు. డబుల్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ‘భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరొచ్చి ఆహార పదార్ధాలు, దుస్తులు, చెద్దర్లు అన్నీ తడిసిపోయాయి. కనీసం వండుకుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు లేవు. అందుకే వారికి తక్షణ సాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.10వేల చొప్పున […]
రెండు విభాగాలుగా చేసి ఐఏఎస్ లకు బాధ్యతలు అప్పగించాలి మరిన్ని సంస్థాగత మార్పులు జరగాలి వ్యవసాయశాఖపై సమీక్షలో సీఎం కె.చంద్రశేఖర్రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా మారుతోందని, అందుకు తగ్గట్టుగా వ్యవసాయశాఖ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారులను బాధ్యులుగా నియమించాలని ఆదేశించారు. వర్షాకాలం పంటలను కొనుగోలు చేయడానికి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. ప్రగతిభవన్ లో శుక్రవారం […]
సారథి న్యూస్, హైదరాబాద్: వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు శుక్రవారం మద్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొంటారు. వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు. యాసంగిలో పంటల సాగుపై చర్చిస్తారు. ముఖ్యంగా మక్కల సాగుపై విధాన నిర్ణయం […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం మాజీ హోంమంత్రి, ప్రముఖ కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్నా.. నిమోనియా బారినపడ్డాడు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. నాయినికి భార్య అహల్య, కొడుకు దేవేందర్రెడ్డి, కుమార్తె సమతారెడ్డి ఉన్నారు. నాయిని అల్లుడు వి.శ్రీనివాస్రెడ్డి రాంనగర్ డివిజన్ కార్పొరేటర్. సోషలిస్టుగా జీవితం ప్రారంభించిన నాయిని సాదాసీదా మనస్తత్వం.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే భోళాతనం ఆయన […]
హైదరాబాద్లో వరద బాధితులకు ప్రభుత్వం చేయూత, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు జిల్లాల కలెక్టర్లు, బృందాలు వెంటనే రంగంలోకి దిగాలి భరోసా కల్పించిన సీఎం కె.చంద్రశేఖర్రావు సారథి న్యూస్, హైదరాబాద్: భారీవర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భరోసా కల్పించారు. హైదరాబాద్ నగరంలోని వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం […]