Breaking News

MULUGU

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

సారథి న్యూస్, ములుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య కోరారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెర్ప్ ద్వారా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఆర్థిక స్తోమత ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వపరంగా పరిశ్రమల స్థాపనకు సహకరించాలన్నారు. జనాభాపరంగా అన్ని సామాజికవర్గాలకు లబ్ధి చేకూరాలన్నారు. టీ-ప్రైడ్ పథకం ద్వారా 8 దరఖాస్తులు రాగా, ఏడింటిని పరిశీలించి […]

Read More
దసరా కానుకగా తీరొక్క చీరలు

దసరా కానుకగా తీరొక్క చీరలు

సారథి న్యూస్, ములుగు: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రతి ఏడాది మంచి డిజైన్లు, నాణ్యత పరంగా మెరుగుపర్చుకుంటూ ఈ ఏడాది 287 డిజైన్లతో చీరలను తయారు చేశామన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో 85వేల మంది, రాష్ట్రంలో కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మేడారం అమ్మవార్లు […]

Read More
చల్వాయి నర్సరీని పరిశీలించిన డీఎఫ్వో

చల్వాయి నర్సరీని పరిశీలించిన డీఎఫ్ వో

సారథి న్యూస్, వాజేడు: పస్రా ఫారెస్ట్​రేంజ్ పరిధిలో ఉన్న చల్వాయి నర్సరీ కేంద్రాన్ని గురువారం ములుగు డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. నర్సరీలో ఉన్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకుని కొన్ని సూచనలు చేశారు. అనంతరం లక్నవరంలోని ఎకో పార్క్ ను సందర్శించిన డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి సిబ్బందిని ఫుడ్ కోర్ట్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అలాగే పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం లక్నవరంలోని వాచ్ టవర్ […]

Read More

కరకట్ట కోసం నిధులు ఇవ్వండి

సారథి న్యూస్​, ములుగు: గోదావరి నదిపై కరకట్ట నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతిపత్రం ఇచ్చారు. సోమవారం ఆమె హైదరాబాద్​లో రజత్​కుమార్​ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గంలోని మూడు మండలాల గుండా దాదాపు 100 కి.మీ.మేర గోదావరి ప్రవహిస్తుందని చెప్పారు. ఏటా వచ్చే వరదల వల్ల వందలాది ఎకరాల పంట పొలాలు కోతకు గురవుతున్నాయని చెప్పారు. […]

Read More

వ్యవసాయ బిల్లు.. రైతులకు గుదిబండ

సారథి న్యూస్​, వెంకటాపురం: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు గుదిబండ లాంటిదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఏఐసీసీ పిలుపుమేరకు ములుగు జిల్లా నుగూరు వెంకటాపురం మండలకేంద్రంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు అధాని, అంబానీ కోసమేనని విమర్శించారు. బిల్లు ప్రకారం సప్లై చైన్ లో రైతులనుంచి రీటైలర్ వరకూ ఎవరు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ […]

Read More
మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడవాలి

మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడవాలి

ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సారథి న్యూస్​, ములుగు: మహాత్మాగాంధీ మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. శుక్రవారం మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ లో గాంధీజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక రుగ్మతలు లేకుండా దేశం అభివృద్ధిపథంలో నడిపేందుకు కృషిచేసిన గాంధీజీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు ఇచ్చిన ఘనమైన […]

Read More
బొగత జలపాతం ఓపెన్​

బొగత జలపాతం ఓపెన్​

సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లాలోని వాజేడు మండలం చికుపల్లి అటవీ పాంత్రంలో ఉన్న బొగత జలపాతాన్ని వెంకటాపురం రేంజ్ ఆఫీసర్, వాజేడు ఎస్సై తిరుపతి రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బొగత జలపాతానికి వచ్చే పర్యాటకులు అటవీ అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరి కట్టుకుని బొగత జలపాతం సందర్శనకు రావాలని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. […]

Read More
రావొచ్చు.. పోవచ్చు

రావొచ్చు.. పోవచ్చు

ములుగు జిల్లాలో టూరిస్టు ప్రదేశాలకు అనుమతి కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి: డీఎఫ్ వో సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో ఉన్న ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలైన బొగత వాటర్ ఫాల్స్, తాడ్వాయి హాట్స్, లక్నవరం ఎకో పార్కుల్లో పర్యాటకులను అక్టోబర్ 1వ తేదీ నుంచి అనుమతించనున్నట్లు డీఎఫ్​వో ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పర్యాటకులు తప్పనిసరిగా మాస్కు పెట్టుకుని, శానిటైజర్ వెంట తీసుకురావాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించి, […]

Read More