Breaking News

JOGULAMBA

రైతుల అభ్యున్నతి కోసమే రైతువేదికలు

రైతుల అభ్యున్నతి కోసమే రైతువేదికలు

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని నారాయణపురం, మద్దూరు, కలుగొట్లలో రైతు వేదిక భవనాలను బుధవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. రైతుల అభ్యున్నతి కోసమే రైతు వేదికలను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 60లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. రైతు వేదికల వద్ద రైతాంగం సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. అన్నదాతల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్ ​సరిత, కలెక్టర్ శృతిఓజా, సర్పంచ్ లక్ష్మీదేవి, […]

Read More
దేదీప్యమానంగా తెప్పోత్సవం

దేదీప్యమానంగా తెప్పోత్సవం

సారథి న్యూస్, మానవపాడు(అలంపూర్): తెలంగాణలోనే ప్రఖ్యాతిచెందిన ఐదవ శక్తిపీఠం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేదీప్యమానంగా తెప్పోత్సవం జరిగింది. ఆలయ సమీపంలోని తుంగభద్ర నదిలో హంస వాహనంపై ఆదిదంపతుల(స్వామి, అమ్మవారు) తెప్పోత్సవ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించగా.. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ‘జై జోగుళాంబ, జై బాలబ్రహ్మేశ్వరా!’ అంటూ భక్తులు జయజయధ్వానాలు పలికారు. అంతకుముందు స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయాల నుంచి ఊరేగింపుగా పల్లకీలో నది వద్దకు తీసుకొచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో […]

Read More
జోగుళాంబ సన్నిధిలో మంత్రి నిరంజన్​రెడ్డి

జోగుళాంబ సన్నిధిలో మంత్రి నిరంజన్​రెడ్డి

సారథి న్యూస్, అలంపూర్: అలంపూర్ ​జోగుళాంబ అమ్మవారిని దసరా నవరాత్రుల సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొన్నారు. జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో అలంపూర్​ఎమ్మెల్యే వీఎం అబ్రహాం, నాయకులు కిషోర్​కుమార్, అలంపూర్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.

Read More
జోగుళాంబకు జడ్పీ చైర్​పర్సన్​పూజలు

జోగుళాంబకు జడ్పీ చైర్​పర్సన్ ​పూజలు

సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు, బాల బ్రహ్మేశ్వర దీవెనలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికిపై ఉండాలని కోరుతూ జడ్పీ చైర్​పర్సన్​సరిత అమ్మవారికి పట్టువస్త్రాలు అలంకరించారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మన్న, వడేపల్లి జడ్పీటీసీ కాశపోగు రాజు, రాజోలి జడ్పీటీసీ సుగుణమ్మ, శ్రీనాథ్ రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మునగాల నరసింహులు, […]

Read More
ఆహ్లాదభరితం.. ఆనందమయం

ఆహ్లాదభరితం.. ఆనందమయం

ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్న ప్రేమికులు శ్రీశైలం, సుంకేసుల, జూరాల, అవుకుకు వెళ్లేందుకు టూరిస్టుల ఆసక్తి సారథి న్యూస్, కర్నూలు: కరోనా ముప్పు ఇప్పుడిప్పుడే తొలగిపోయినట్టు కనిపిస్తోంది. జిల్లాలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పలువురు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా తరలివస్తుండడంతో తుంగభద్ర, కృష్ణానదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి , నారాయణ్‌పూర్‌ డ్యాం గేట్లు ఎత్తడంతో జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరదనీరు ఉధృతికి […]

Read More
అలంపూర్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు

అలంపూర్​లో సీసీ కెమెరాల ఏర్పాటు

సారథి న్యూస్​, అలంపూర్​: నేరాలను అరికట్టేందుకు పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్​ రతన్​ కుమార్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘నేనుసైతం’ కార్యక్రమంలో భాగంగా అలంపూర్​ చౌరస్తాలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు నారాయణ గౌడ్ ఆర్థికసాయం చేశారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి, సీఐ వెంకట్రామయ్య, ఎస్సై మధుసూదన రెడ్డి, ఏఎస్సై అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.

Read More
జూరాల లింక్ కెనాల్ కు గండి

జూరాల లింక్ కెనాల్ కు గండి

సారథిన్యూస్​, మానోపాడు: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి చిన్న ఆముదాలపాడు మధ్యన ఉన్న జూరాల లింక్ ఆర్​ డీఎస్​ ప్రధాన కాల్వకు భారీ గండి పడింది. దీంతో రెండు రోజులుగా పంటపొలాల్లో కాలువ నీరు ప్రహిస్తుండంతో పొలాలు ఆగమవుతున్నయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ కాలువ పరిస్థితి ఇదేవిధంగా ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. ప్రధాన కాలువలో సీల్టు తీయకపోవడం వల్లే ఈ గండ్లు ఏర్పడుతున్నాయని సమీప బాధిత […]

Read More
అలంపూర్ లో కరోనా పాజిటివ్

అలంపూర్ లో కరోనా పాజిటివ్

సారథి న్యూస్​, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓ డ్రైవర్ కు కరోనా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి, మున్సిపల్ చైర్మన్ మదన్​మోహన్​స్పష్టంచేశారు. ఇటీవల అతడు జ్వరంతో బాధపడుతుండగా, వైద్యపరీక్షలు చేయించగా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఆ ఇంటిలో 12 మంది ఉండడంతో కరోనా ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Read More