సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం(24 గంటల్లో) కొత్తగా 2,795 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా రాష్ట్రంలో 8 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 788 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,14,483కు చేరింది. మొత్తం యాక్టివ్ కేసులు 27,600 మేర ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 30,772 శాంపిళ్లను కలెక్ట్ చేయగా 1,075 పెండింగ్ లో ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 449, కరీంనగర్ 136, ఖమ్మం 152, మహబూబాబాద్ 102, మంచిర్యాల […]
కరోనా వైరస్బారినపడకుండా ఉండేందుకు అందరికీ ఫేస్మాస్క్లు పెట్టుకోవడం అలవాటైంది. అయితే ఫేస్ మాస్క్లో పేరుకుపోయే దుమ్ము, ధూళి, చెమట కారణంగా చాలామంది మొటిమలు వస్తున్నాయి. అలాగే చేతులు కడగడం వల్ల పొడిబారడం వంటి సమస్యలూ వస్తున్నాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.తరచూ చేతులు కడుక్కోవడం లేదా హ్యాండ్ శానిటైజర్ రాసుకోవడం, రోజూ ఫేస్మాస్క్పెట్టుకోవడం అందరికీ ఇటీవల అలవాటైన పనులు. ఇవి వైరస్ నుంచి కాపాడుతున్నాయి కరెక్టే. కానీ చాలామందికి వీటివల్ల స్కిన్ఇన్ఫెక్షన్లు […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బుధవారం(24 గంటల్లో) 10,830 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. తాజాగా కోవిడ్నుంచి కోలుకుని 8,473 మంది డిశ్చార్జ్అయ్యారు. తాజాగా మహమ్మారి బారినపడి 81 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 3,541కు చేరింది. రాష్ట్రంలో 34,18,690 శాంపిళ్లను పరీక్షించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 728, చిత్తూరు 913, ఈస్ట్గోదావరి 1,528, గుంటూరు 532, కడప 728, కృష్ణా 299, కర్నూలు […]
సారథి న్యూస్, కర్నూలు: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేస్తోంది. ఆ పేరు చెబితేనే అందరూ ఉలిక్కిపడే పరిస్థితి. కరోనాతో చనిపోయారని వింటేనే చాలు .. రక్తపంచుకు పుట్టినవారు, ఆప్తులు, బంధువులు, నా.. అనే వారు ఎవరూ ముందుకురావడం లేదు. కానీ ఓ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా.. అందరిలోనూ ధైర్యం నింపేలా.. కరోనా భూతంపై అవగాహన కల్పించేలా ముందుకొచ్చి అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. ఆయన ఎవరో కాదు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్. కోవిడ్ బారినపడి మృతిచెందిన ఓ […]
బాధితుల పట్ల మానవత్వం చూపాలి సెప్టెంబర్ 7లోగా పంటనష్టంపై అంచనాలు వీడియో కాన్ఫరెన్స్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సారథి న్యూస్, కర్నూలు: ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దానికంటే.. కోవిడ్ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. బాధితుల పట్ల మానవత్వం చూపాలని హితబోధ చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో ‘స్పందన’ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం(24 గంటల్లో) 2,579 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా, రాష్ట్రంలో తాజాగా 9 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 770 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,08,670గా నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్కేసులు 23,737 ఉన్నాయి. తాజాగా 1,752 మంది వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ఇలా ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 84,163కు చేరింది. అత్యధికంగా హైదరాబాద్పరిధిలో 295 కేసులు నమోదు నమోదయ్యాయి. జిల్లాల వారీగా […]
సారథి న్యూస్, హైదారాబాద్: సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియా ఆస్పత్రుల్లో కోవిడ్ 19 వైద్యసేవల కోసం ఇప్పటివరకు రూ.8కోట్ల విలువైన మందులు, కిట్లు, సూట్లు పరికరాలను సిద్ధంగా ఉంచామని, మరో 21మంది డాక్టర్లను వైద్యసేవల కోసం తాత్కాలికంగా నియమించామని సంస్థ చైర్మన్, ఎండీ ఎం.శ్రీధర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం సింగరేణి ఆస్పత్రిల్లో కరోనాకు కేటాయించిన 643 బెడ్లకు అదనంగా మరో 600 బెడ్లను సిద్ధం చేసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సోమవారం(24గంటల్లో) 8,601 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 86 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 3,368 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,58,817కు చేరింది. 24 గంటల్లో 54,463 శాంపిల్స్ టెస్టులు చేయగా, ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య 32,92,501కు చేరింది. గత 24 గంటల్లో 8,741 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మహమ్మారి బారినపడి 2,68,828 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 89,516 యాక్టివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక […]