జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే.. లేకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటింటికీ ఉద్యోగం ఏమైంది పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షను సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని, దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్అన్నారు. రాత్రికి రాత్రే ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చారన్నారు. వైపు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతుంటే ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం ఊడగొడుతోందని మండిపడ్డారు. […]
సామాజిక సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ను గద్దె దించేందుకు నిరుద్యోగ యువత, విద్యార్థులు కలసి రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. నీరోచక్రవర్తిలా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఏడాదిలో ఎక్కువ రోజులు ఫాంహౌస్లోనే ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని ఎద్దేవాచేశారు. ఎంతోమంది ఆఫీసర్లు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, అలాంటి వారి పరిస్థితి ఏమైందో ఒక్కసారి చరిత్రను చూడండి అంటూ అధికారులపై ఈటల మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. […]
టీఆర్ఎస్ సర్కార్ కూలిపోవడం ఖాయం రైతు రవి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందర్ రావు సామాజికసారథి, మెదక్: రాష్ట్రంలోని రైతుల ఉసురు తగిలి టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాలోని హవేళి ఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్రావు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోతబారి రైతునని చెప్పుకునే సీఎం కేసీఆర్ […]
అసలు ఆయన తెలంగాణ బిడ్డేనా? అమరుల స్థూపాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్కు ఎట్లిస్తారు టీపీసీసీ చీఫ్రేవంత్ రెట్టి సూటిప్రశ్న సామాజికసారథి, హైదరాబాద్: అమరుల స్థూపం నిర్మాణం కట్టడానికి తెలంగాణ వారు పనికి రారా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు డీఎన్ఏ టెస్ట్చేయించాలన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణం టెండర్ను ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన కెపీసీ కంపెనీకి ఇచ్చారని అన్నారు. శనివారం […]
టీఆర్ఎస్లో మళ్లీ సంస్థాగత సందడి పార్టీ పదవులు, ప్రభుత్వ నియామకాలపై ఆశ అధినేత కరుణ కోసం ఆశావహుల ఎదురుచూపు 2023 సాధారణ ఎన్నికల్లోగా దక్కించుకోవాలని పట్టుబడుతున్న నేతలు ఈనెల 15న ముగియనున్న ఎమ్మెల్సీ కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ముగియనున్న వేళ సంస్థాగత పదవుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నియామక ప్రక్రియ ఇప్పటికే పలు కారణాలతో వాయిదాపడిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్పార్టీలో శాసనమండలి సభ్యత్వాన్ని ఆశించి అవకాశం రానివారు అటు వైపు ఆశగా చూస్తున్నారు. పలు […]
సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలి నాణ్యత విషయంలో రాజీపడొద్దు పరిశీలించి కొన్ని సూచనలు చేసిన సీఎం కేసీఆర్ సామాజికసారథి, హైదరాబాద్: నూతన సెక్రటేరియట్నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. సచివాలయ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరును అలాగే ముందుకు కొనసాగించాలని సూచించారు. సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని కోరారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో […]
ఉన్నతస్థాయి సమీక్షలో సీఏం వైఎస్జగన్ అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ఓటీఎస్ పై అవగాహన కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, ఓటీఎస్ పథకంపై సీఎం జగన్ బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఓటీఎస్పై అవగాహన కల్పించాలని, ఓటీఎస్ అనేది పూర్తి స్వచ్ఛందమని స్పష్టం చేశారు. రూ.10వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్కూడా ఉచితంగా చేస్తున్నామని […]
సామాజిక సారథి, హైదరాబాద్: బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్డాక్టర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్ ట్విట్టర్వేదికగా శుక్రవారం మరోసారి అన్నదాతల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధాన్యం రోడ్లపై, కల్లాల్లోనూ ఉందని, వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్చేశారు. ‘‘తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేయకుండా యాసంగిలో వరి వేయొద్దందటే ఎట్లా? ఖరీఫ్ లో పండిన 70శాతం ధాన్యం కల్లాల్లోనే ఉంది. వడ్లు అమ్ముకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రూ.వేలకోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు కట్టింది ఎందుకోసం? ఎవరి కోసం? కేవలం కాంట్రాక్టులు, కక్కుర్తి కమీషన్ల […]