సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సీఎం ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే వారం పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా కోరలు చాచింది.. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. కొత్త వ్యక్తులకు అంటుకుంటోంది.. తెలంగాణలో ఆదివారం కొత్తగా 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 మంది మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో నుంచి అత్యధికంగా 195 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,974 కు చేరింది. ఇప్పటివరకు 185 మంది మృత్యువాతపడ్డారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయినవారు 2,377 మంది దాకా ఉన్నారు. తెలంగాణలో యాక్టివ్ కేసుల […]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రెండు రోజులుగా కేసుల సంఖ్య 11వేలకు పైగా నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 11,929 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. 311 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 9,195కు చేరిందని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ఆదివారం ప్రకటించింది. పాజిటివ్ కేసుల సంఖ్యలో ప్రస్తుతం మన దేశం నాలుగో స్థానంలో ఉంది. మన దేశంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ ఆ తర్వాత స్థానాల్లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం 253 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. 24 గంటల్లో 8 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 182 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో 179 కేసులు, సంగారెడ్డి జిల్లా నుంచి 24 పాజిటివ్ కేసులు, మేడ్చల్ జిల్లా నుంచి 14 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 11, మహబూబ్ నగర్లో నాలుగు, వరంగల్ రూరల్ జిల్లాలో రెండు, వరంగల్ అర్బన్ జిల్లాలో రెండు, కరీంనగర్ రెండు, నల్లగొండ రెండు, ములుగు రెండు, […]
సారథి న్యూస్, మెదక్: తమ ఇళ్ల సమీపంలో కోవిడ్–19 నిర్ధారణ సెంటర్ ఏర్పాటు చేయొద్దని మెదక్ పట్టణంలోని జంబికుంట వీధి ప్రజలు ఆందోళన చేపట్టారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ ల్యాబ్ ఏర్పాటుపై శుక్రవారం పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతులమీదుగా ల్యాబ్ ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేయగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. కాగా పోలీసులు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, 5వ వార్డు కౌన్సిలర్ మామిళ్ల […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల్లో 9మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 174 కి చేరింది. శుక్రవారం ఒకేరోజు కొత్తగా 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 133 కేసులు పాజిటివ్ గా తేలాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,484కు చేరింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఆరు చొప్పున, సంగారెడ్డి జిల్లాలో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో మూడు, మహబూబ్ నగర్, కరీంనగర్, ములుగు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,320 పాజిటివ్ కేసులుగా తేలాయి. ఇప్పటివరకు 165 మంది మృతిచెందారు. చికిత్స అనంతరం 1993 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2162కు చేరింది. జీహెచ్ఎంసీ నుంచి అత్యధికంగా 143, మేడ్చల్ జిల్లాలో 11, సంగారెడ్డి 11, రంగారెడ్డి 8, మహబూబ్ నగర్ 4, మెదక్ 3, జగిత్యాల జిల్లాలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉండగా, హైదరాబాద్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల కరోనా వ్యాధితో మృతిచెందిన జర్నలిస్ట్ మనోజ్కుమార్ కు జర్నలిస్టులు, పలువురు రాజకీయ పార్టీల నేతలు గురువారం సాయంత్రం హైదరాబాద్లోని గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారావు, సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ క్యాండిల్ వెలిగించి నివాళులర్పించారు. మనోజ్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ […]