సారథి న్యూస్, మెదక్: తమ ఇళ్ల సమీపంలో కోవిడ్–19 నిర్ధారణ సెంటర్ ఏర్పాటు చేయొద్దని మెదక్ పట్టణంలోని జంబికుంట వీధి ప్రజలు ఆందోళన చేపట్టారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ ల్యాబ్ ఏర్పాటుపై శుక్రవారం పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతులమీదుగా ల్యాబ్ ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేయగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. కాగా పోలీసులు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, 5వ వార్డు కౌన్సిలర్ మామిళ్ల […]
గ్లామర్ తో మైమరపించి.. డ్యాన్స్తో మెస్మరైజ్ చేసి ఫ్యాన్స్ను ఫిదా చేసే మిల్క్ బ్యూటీ తమన్నా స్టైల్ హీయిన్గానే కాకుండా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ తో కూడా అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇటీవల ఓ అభిమానితో లైవ్ చాటింగ్ చేస్తున్నప్పుడు.. అన్ని సినిమాలున్నా స్పెషల్ సాంగ్స్ ఎందుకు చేస్తున్నారు? అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది.. ‘నేను స్పెషల్ సాంగ్స్ చేయడాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. డబ్బు కోసమే అలాంటి పాటలు చేస్తున్నానని కూడా అంటున్నారు. అలాంటి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల్లో 9మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 174 కి చేరింది. శుక్రవారం ఒకేరోజు కొత్తగా 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 133 కేసులు పాజిటివ్ గా తేలాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,484కు చేరింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఆరు చొప్పున, సంగారెడ్డి జిల్లాలో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో మూడు, మహబూబ్ నగర్, కరీంనగర్, ములుగు […]
సారథి న్యూస్, మెదక్: కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడం, టెస్టుల కోసం హైదరాబాద్ వెళ్లడం ఇబ్బందికరంగా మారడంతో మెదక్లోనే కోవిడ్–19 టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్టు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి వెల్లడించారు. మెదక్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ల్యాబ్ను శుక్రవారం ఆమె కలెక్టర్ ఎం.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. మెదక్ జిల్లా ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పట్టణంలోనే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎవరికైనా […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ హైదరాబాద్ పోలీస్ శాఖలో భయం పుట్టిస్తోంది. డిపార్ట్మెంట్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, శుక్రవారం ఆ సంఖ్య 15కు చేరింది.. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోనే 15 మంది పోలీసు అధికారులకు కరోనా సోకడంతో ఖాకీలు హడలిపోతున్నారు. మూడు రోజుల నుంచి మెడికల్ టెస్టుల్లో వరుసగా కరోనా కేసులు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అందరినీ వైరస్ వణికిస్తోంది. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్గా పనిచేసే వ్యక్తికి వైరస్ ప్రబలింది. దీంతో మేయర్ సహా వారి కుటుంబసభ్యులు, ఇతర అధికారులను హోం క్వారంటైన్లో ఉంచారు. తాజాగా మంత్రి హరీశ్రావు పీఏకు కూడా కరోనా ప్రబలినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి హరీశ్ రావుతో పాటు కుటుంబసభ్యులు హోం క్వారంటైన్లోకి వెళ్లినట్లు సమాచారం. […]
సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు ఇటీవల కాంగ్రెస్ బీసీ సెల్ కరీంనగర్ జిల్లా చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనను ఘనంగా సన్మానించారు. యూత్ కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థి నేతగా, యువజన నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా దాదాపు 20 ఏళ్లపాటు చేసిన కృషికి పార్టీ అధిష్టానం ఈ పదవి కట్టబెట్టిందన్నారు. కార్యక్రమంలో వెలిచాల మాజీ సర్పంచ్ […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: వానాకాలంలో ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా.. రైతన్నలకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. నిన్న మొన్న వరుసగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఫర్టిలైజర్ షాపులు, అగ్రికల్చర్ ఆఫీసుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంతో పాటు తడ్కల్ గ్రామంలో ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సోయాబీన్ విత్తనాల కోసం […]