Breaking News

CARONA

మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు

మహారాష్ట్రలో 9వేల కొత్తకేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 9,895 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,502కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మహారాష్ట్రలో 12,854 మంది మృతిచెందారు. గత 24 గంటల్లోనే 298 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఇప్పటివరకు 1,94, 253 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో ఇప్పటికే సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని కొందరు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న మూడు, నాలుగు వారాల్లో వ్యాధి తీవ్రత మరిత పెరిగే […]

Read More

ఢిల్లీలో పక్కాగా కట్టడి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది. దీంతో ఇప్పడందరూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ను ప్రశంసిస్తున్నారు. అత్యధిక టెస్టులు చేయడం.. సకాలంలో వైద్యం చేయడం, ప్రజలకు కరోనాపై విస్తృత అవగాహన కల్పించడమే కేజ్రీవాల్​ విజయరహస్యం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చొరవ తీసుకోవడం కూడా కారణమని మరికొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో కరోనా కంట్రోల్​లోకి రావడం స్వాగతించవలిసిన అంశమే. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో […]

Read More
అందరికీ కరోనా టెస్టులు చేయాలి

అందరికీ కరోనా టెస్టులు చేయాలి

సారథి న్యూస్, వాజేడు(ములుగు): అందరికీ కరోనా టెస్టులు చేయాలని టీఏజీఎస్ అధ్యక్షుడు దబ్బకట్ల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ములుగు జిల్లా వాజేడు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. అన్ని ఆస్పత్రుల్లో కరోనాకు వైద్యం చేయాలని డిమాండ్​చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ.7,500 ఇవ్వాలని కోరారు. ప్రతి రేషన్​కార్డుదారుడికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఉపాధి పనిదినాలు రెండొందల రోజులకు పెంచాలన్నారు. రోజుకు రూ.600 వేతనం ఇస్తూ.. ఫీల్డ్​ అసిస్టెంట్లతో పనులు చేయించాలన్నారు. మధ్యాహ్న భోజనం ఇంటివద్దకే పంపించాలని, […]

Read More
నిబంధనలకు అనుగుణంగానే వినాయక చవితి

నిబంధనలకు అనుగుణంగానే గణేష్​ ఉత్సవాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​ మహానగరంలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను కోవిడ్‌–19 మార్గదర్శకాల ప్రకారమే జరుపుకోవాలని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు బేగంబజార్‌లోని బహేతిభవన్‌లో అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావు, ఉపాధ్యక్షుడు రామరాజు నేతృత్వంలో సమితి సభ్యులు సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి భక్తులు మాస్కులు కట్టుకోవడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం భక్తులకు తగిన ఏర్పాట్లు […]

Read More
పంద్రాగస్టు.. వీళ్లే ఆహ్వానితులు

పంద్రాగస్టు.. వీళ్లే ఆహ్వానితులు

సారథి న్యూస్, హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి కోలుకున్న వారిని ఆగస్టు 15న‌ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక‌, రాష్ట్ర రాజధానుల్లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించాలని సూచించారు. పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్‌సీసీ దళాలు మార్చ్‌ఫాస్ట్‌కు మాస్క్‌ ధరించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కరోనా దృష్ట్యా భారీస్థాయిలో ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు […]

Read More

తెలంగాణ‌లో డేంజర్​ బెల్స్​

సారథిన్యూస్​, హైదరాబాద్: తెలంగాణ‌లో క‌రోనావైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి స్టేజ్ 3కి చేరుకుంద‌ని, క‌మ్యూనిటీ స్ప్రేడ్ అవుతుంద‌ని సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు. వ‌చ్చే నాలుగు-ఐదు వారాలు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ప్ర‌జ‌లంతా మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఇక‌, రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లో కూడా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయ‌న్న శ్రీ‌నివాస‌రావు ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం అన్నారు. ల‌క్ష‌ణాలు లేనివారు క‌రోనా టెస్ట్‌ల […]

Read More
కరోనాతో 9 మంది మృతి

కరోనాతో 9 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,567 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 50,826కు పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 1,661 మంది రికవరీ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 9 మంది కరోనా మృత్యువాతపడ్డారు. ఇప్పటిదాకా 438 మంది మృతిచెందారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ 662 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 213, మేడ్చల్​33, సంగారెడ్డి 32, ఖమ్మం 10, కామారెడ్డి 17, వరంగల్ ​అర్బన్​75, వరంగల్ ​రూరల్​ 22, కరీంనగర్ 38, జగిత్యాల […]

Read More

ధైర్యంగా ఉండాలె

సారథి న్యూస్​, రామగుండం: కరోనా బాధితులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. తగిన వైద్యం తీసుకుంటే ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చని చెప్పారు. దేశంలో కరోనా బారినపడి ఎంతో మంది 85 శాతంపైనే కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. గురువారం సీపీ ఆదేశాల మేరకు డీసీపీ అశోక్​కుమార్ నేతృత్వంలో ​ కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయి చికిత్సపొందుతున్న పోలీసులకు రోగనిరోధకశక్తిని పెంచే పండ్లు, డ్రైఫ్రూట్స్​, టాబ్లెట్స్​ అందజేశారు. కరోనా బారినపడ్డ ప్రతి పోలీసు​కు […]

Read More